ఓపెన్ చేసిన తర్వాత ధియేటర్లకు ఖర్చెక్కువ..రాబడి తక్కువ..!

వీలైనంత త్వరగా థియేటర్లు ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నారు హైదరాబాద్‌ థియేటర్ల యజమానులు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా థియేటర్లలో అనేక చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. తిరిగి సినిమా ప్రదర్శనలు మొదలైతే థియేటర్‌లో ఒక సీటు వదిలి మరో సీటులో కూర్చునే విధానాన్ని రూపొందిస్తున్నారు. కరోనా కారణంగా థియేటర్లు మూతపడటడంతో యాభై రోజులుగా ధియేటర్లు తెరవడం లేదు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత గతంలోలా ధియేటర్లు నిండే పరిస్థితిలేదు.

ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్‌ చేసుకున్నప్పుడే ఒక సీటు తర్వాత మరో సీటు అందుబాటులో ఉండకుండా సాంకేతిక మార్పులు చేయబోతున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే మాత్రం ఒక కుటుంబంలోని వ్యక్తులకు ఒకేచోట సీట్లు కావాలంటే కేటాయించే అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. సాధారణంగా ఒక ఆట పూర్తై పది నిమిషాల్లోనే మరో షో మొదలవుతోంది. ఇకముందు 45 నిమిషాల తర్వాతే మొదలుపెడతారు. దీన్నిబట్టి రోజుకు నాలుగు ఆటలకు బదులు మూడే ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఇక కాగితం రూపంలో టిక్కెట్లు ఇచ్చే విధానాన్ని పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించారు. ఇక క్యూఆర్‌కోడ్‌తో టికెట్‌ను సెల్‌ఫోన్‌కు పంపిస్తారు.

దీన్ని స్కాన్‌ చేసి హాలు లోపలికి పంపిస్తారు. తినుబండారాల స్టాల్స్‌ వద్ద, మరుగుదొడ్ల దగ్గర, భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆవరణలో ఎక్కడా గుమిగూడకుండా చర్యలు తీసుకుంటారు. ఇవే కాకుండా ప్రభుత్వం సూచించే అన్ని నిబంధనల అమలుకు కార్యాచరణ రూపొందిస్తారు. ఇన్ని చేసినా జనం థియేటర్ కి వస్తారా అన్నదే ప్రధాన ప్రశ్న. సీటు మార్చిసీటుటిక్కెట్ అమ్మితే కలెక్షన్ సగానికి పడిపోతుంది. ఈ సమస్యలన్నీ అధిగమించడం..ధియేటర్ యజమానులకు అంత తేలిక కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ : రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలిసుల నోటిసులు..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close