పథకాల అమలు పర్యవేక్షణకు జగన్..!

సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్.. అవి క్షేత్ర స్థాయిలో ఎలా అమలవుతున్నాయో పర్యవేక్షించేందుకు గ్రామాల బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. పారదర్శకత, అవినీతి, వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూడాలని.. మనకు ఓటేయకపోయినా అర్హత ఉన్నవారికి పథకాలు అందాలని జగన్ ఎప్పుడు సమావేశం జరిగినా అధికారులకు ఉద్భోధిస్తున్నారు. ప్రకటించిన సమయంలోగా సకాలంలో పథకాలు అందాలని.. ఎవరి దరఖాస్తులను కూడా తిరస్కరించకూడదని స్పష్టం చేస్తున్నారు. అర్హత ఉన్న వారికి పథకాలు అందకపోతే… అధికారులే బాధ్యులని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ వస్తున్నారు.

పెన్షన్, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీకార్డులు, రేషన్‌ కార్డులు… తప్పనిసరిగా అర్హులకు అందాలి, మొదట వీటిపై దృష్టి పెట్టాలన్నారు. ఆగస్టునుంచి గ్రామాల్లో పర్యటనకు సిద్ధమవుతున్నానని… పథకాలు అందలేదని ఎలాంటి ఫిర్యాదులు రావొద్దని సీఎం స్పష్టం చేశారు. పథకాల విషయంలో ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం నమ్ముతోంది. గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా… అర్హులందరికీ లబ్ది కలిగిస్తున్నామని.. ప్రజల్లో సానుకూలత ఉంటుందని అంచనా వేస్తోంది. అందుకే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.

ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందికానీ.. అర్హతల పేరిట… అరవై, డెబ్భై శాతం మందిని అనర్హుల్ని చేస్తోందన్న విమర్శలు విపక్షాల నుంచి ప్రజల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమస్యల ను ప్రభుత్వం అధిగమించాల్సి ఉంది. రెండు నెలలలో సీఎం గ్రామాల పర్యటన ప్రారంభించేనాటికి.., ఆ సమస్యలను అధికారులు పరిష్కరించాల్సి ఉంది. సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజా క్షేత్రంలోకి రాలేదు. ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. ఇక ముందు ఖచ్చితంగా పర్యటించాలని ఆయన అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close