ఆర్థిక సర్వే : ఏడాదిలో ఏపీ అద్భుత ప్రగతి..!

జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని.. ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోయాయని.. పనులు లేకుండా పోయాయని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి కానీ… ఏపీ అభివృద్ధి పథంలో సాగుతోందని.. ఆర్థిక సర్వే వెల్లడించింది. ప్రభుత్వ పన్నుల ఆదాయం దాదాపుగా పది వేల కోట్ల రూపాయలకు పడిపోయినా కూడా.. జీఎస్‌డీపీ 12.73 శాతం పెరిగింది. ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన ఆర్థిక సర్వే ప్రకారం… 2019-20లో జీఎస్‌డీపీ రూ.9,72,782 కోట్లుగా నమోదైంది. తెలుగుదేశం పార్టీ హయాంలో అంతకు ముందు ఏడాది 2018-19లో దీని విలువ రూ.8,62,957 కోట్లు మాత్రమే. అంటే జగన్ పాలన చేపట్టిన ఏడాదిలో ఏపీ జీఎస్‌డీపీ రూ.1.10 లక్షల కోట్లు పెరిగిందన్నమాట.

ఏడాదిలో ప్రజల ఆదాయం కూడా బాగా పెరిగింది. 2019-20 కాలానికి ఏపీ తలసరి ఆదాయం రూ.1,69,519. అంటే.. సగటున.. ఏపీలో ఒక్కో వ్యక్తి రూ. లక్షా డెభ్బై వేల వరకూ సంపాదించారన్నమాట. చంద్రబాబు హయాంలో… ఇది.. రూ.1,51,173 మాత్రమే ఉన్నట్లుగా ఆర్థిక సర్వే వెల్లడించింది. జాతీయ తలసరి ఆదాయం రూ.1,34,432 మాత్రమే. అంటే.. ఏపీ దేశ సగటు కన్నా ఎక్కువ ఆదాయంతో ఉందన్నమాట. ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో… గత ఏడాది కాలంలో తాము ఏమేం చేశామో.. ఎలా నిధులు ఆదా చేశామో.. ఎలా.. అభివృద్ధి చేశామో వివరించారు.

వాస్తవానికి ఏడాది కాలంలో ఏపీలో అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇసుక కొరత, ప్రభుత్వం అభివృద్ధి పనులు నిలిపివేయడం … కరోనా సహా వివిధ కారణాల వల్ల ప్రజలకు ఉపాధి లేకుండా పోయిందన్న అంచనాలు వచ్చాయి. దీని వల్ల.. ప్రజల తలసరి ఆదాయం తగ్గిపోయిందని చెప్పుకున్నారు. దానికి తగ్గట్లుగా ప్రభుత్వ పన్నుల ఆదాయం దాదాపుగా పదివేల కోట్లు తగ్గింది. అయితే.. ప్రభుత్వ ఆదాయం తగ్గినా సరే.. ప్రజలకు మాత్రం.. తలసరి ఆదాయం పెరిగిందని ప్రభుత్వం లెక్కలు విడుదల చేసింది. మొత్తంగా చూస్తే.. జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనలో ప్రగతి పథంలో ముందుకెళ్తున్నట్లుగానే చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close