టీవీ5 మూర్తి స్క్రీన్‌పైకి రాకుండా విచారణ వ్యూహమా..!?

విచారణ పేరుతో తనను ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేధిస్తున్నారని… టీవీ5 మూర్తి ఓ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే పోలీసులు.. టార్గెట్ పెట్టుకుని మరీ.. కొంత మందిని హరాస్ చేస్తున్నారని.. తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో.. ఏపీ పోలీసులు తన పట్ల వ్యవహరిస్తున్న విధానాన్ని మూర్తి బయట పెట్టడం చర్చనీయాంశం అవుతోంది. అసలు సంబంధం లేని కేసులో మూర్తిపై కేసు పెట్టడమేకాదు.. బెయిల్ తెచ్చుకున్న తర్వాత… వారానికి మూడు, నాలుగు రోజులు విచారణ పేరుతో విజయవాడకు పిలిపించి.. ఖాళీగా కూర్చోబెట్టి పంపిస్తున్నారు. పిలిపించినందుకు తీసుకోవాలి కాబట్టి.. ఏదో ఓ స్టేట్‌మెంట్.. అరగంట పాటు తీసుకుంటున్నారు.

కొన్నాళ్ల కిందట… యూనివర్శిటీ పాలక మండళ్లను ఏపీ సర్కార్ నియమించింది. ఆ నోట్ ఫైల్‌.. ఎవరెవరు.. సిఫార్సు చేశారో.. ఎవరెవర్ని నియమించారో ..మాజీ న్యాయమూర్తి శ్రావణ్.. టీవీ5 చర్చా కార్యక్రమంలో బయట పెట్టారు. అది ఆయన బయటపెట్టారు. ఆ షోకి యాంకర్‌గా టీవీ5 మూర్తి ఉన్నారు. అంతేపోలీసులు మాజీ న్యాయమూర్తి శ్రావణ్‌తో పాటు మూర్తిపైనా.. టీవీ5 యజమానిపైనా కేసులు పెట్టారు. వారు హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. కానీ సహజంగా బెయిల్ షరతుల్లో… విచారణకు సహకరించాలని ఉంటుంది. దీన్నే పట్టుకున్న ఏపీ పోలీసులు చీటికిమాటికి..విచారణ పేరుతో.. మూర్తిని విజయవాడకు పిలుస్తున్నారు.

ఇటీవలి కాలంలో.. టీవీ5 మూర్తి స్క్రీన్ పైకి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి. ఆయన షోలు తగ్గిపోయాయి. దీనికి కారణం ఆయన విచారణ కోసం.. తరచూ విజయవాడ వెళ్తూండటమే. విచారణకు ఎప్పుడైనా వెళ్లకపోతే… సహకరించడం లేదని చెప్పి.. బెయిల్ క్యాన్సిల్ చేయించేదుకు పోలీసులు ఇలా చేస్తున్నారని.. మూర్తి నమ్ముతున్నారు. అందుకే.. పోలీసుల వేధింపుపై వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఎంత చేసినా… తాను వెనక్కి తగ్గనని.. కావాలంటే… తన ఊపిరి తీసుకోవచ్చని ఆయన ప్రకటించేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close