నిర్మాత గుండెల్లో ‘బుల్లెట్’

జ‌నం ఎప్పుడో మ‌ర్చిపోయిన ‘ఆర‌డుగుల బుల్లెట్‌’ మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచింది. గోపీచంద్ – న‌య‌న‌తార జంట‌గా న‌టించిన సినిమా ఇది. బి.గోపాల్ ద‌ర్శ‌కుడు. రెండేళ్ల క్రితం విడుద‌ల కావాల్సిన ఈ సినిమాని, ఇప్పుడు క‌నీసం ఓటీటీలో అయినా తీసుకురావాల‌న్న‌ది నిర్మాత ప్లాన్. అయితే… ఇది కూడా అంత ఆషామాషీ వ్య‌వ‌హారంలా క‌నిపించ‌డం లేదు. ఈ సినిమాపై ఇప్ప‌టికే 20 కోట్ల వ‌ర‌కూ అప్పుంది. ఓటీటీ వాళ్లు మ‌హా అయితే ఆరు నుంచి ఏడు కోట్ల వ‌ర‌కూ ఇవ్వొచ్చు. అంటే.. మిగిలిన న‌ష్ట‌మంతా నిర్మాతే భ‌రించుకోవాల‌న్న‌మాట‌.

ఈ సినిమా వ్య‌వ‌హారం కోర్టులో ఉంది. లావాదేవీల‌న్నీ కోర్టు ప‌రిధిలోనే జ‌ర‌గాలి. ఈ సినిమాని ఎవ‌రు కొనుక్కున్నా… కోర్టు ద్వారానే డ‌బ్బు చెల్లించుకోవాలి. అప్పుల‌న్నీ చెల్లించాక‌… మిగిలిన సొమ్ము మాత్ర‌మే నిర్మాత చేతికొస్తాయి. రూ.20 కోట్ల అప్పుకి, ఏడు కోట్ల రాబ‌డికీ ఏమైనా సంబంధం ఉందా? మ‌రో విష‌యం ఏమిటంటే.. ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల్ని ఏనాడో అమ్మేశారు. దాని ద్వారా ఏడు కోట్ల వ‌ర‌కూ ఆదాయం వ‌స్తోంది. అయితే.. ఓటీటీకి సినిమా అమ్ముకుంటే, ఏ ఛాన‌లూ అంత మొత్తంలో ఈ సినిమాని కొన‌దు. ఆ ఏడు కోట్ల‌లో… మ‌ళ్లీ ఎంతో కొంత వెన‌క్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఏ రూపంలో చూసినా, ఆర‌డుగుల బుల్లెట్‌.. నిర్మాత కంటికి కునుకు లేకుండా చేస్తోంది. అప్పుల్ని ఎంతో కొంత క్లియ‌ర్ చేసుకుని, మిగిలిన సొమ్ము చేబులోంచి ఇవ్వ‌డం మిన‌హా నిర్మాత చేయ‌గ‌లిగిందేం లేదు కూడా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శాంతి భద్రతల వైఫల్యం…జగన్ రెడ్డిని బుక్ చేసిన పోసాని

ఏపీలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో డ్రామాను క్రియేట్ చేయడం వైసీపీకి పారిపాటిగా మారింది. గత ఎన్నికల్లో కోడికత్తి కేసుతో సానుభూతి పొందిన జగన్ రెడ్డి, ఈ ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు గులకరాయి దాడిని...

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close