టిటిడిపికి ఎ.పి. కాంగ్రెస్‌ లాయర్‌!

రాజకీయ అనుబంధాలు, న్యాయ పోరాటాలు కొన్నిసార్లు పరస్పర సంబంధం లేకుండా సాగితే తమాషాగా వుంటుంది. ఉదాహరణకు ఢిల్లీలో రామ్‌జెఠ్మలానీ చాలాసార్లు బిజెపితో వున్నారు. అయినా ఆయన ఇతరులకు సంబంధించిన కేసులు వాదించేందుకు వెనుకాడరు. ఈ మధ్యనే నేషనల్‌ హెరాల్డ్‌ కేసువాదిస్తానని ఆఫర్‌ ఇచ్చినా సోనియా గాంధీ స్వీకరించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో వైసీపీ నేత జగన్‌ తరపున ఒకసారి వచ్చి వాదించివెళ్లారు. కపిల్‌ సిబాల్‌ వంటివారికి కూడా ఈ తరహా అనుభవాలున్నాయి.ఇప్పుడు హైదరాబాదులో జంధ్యాల శంకర్‌ అలాగే రాజకీయ రాజ్యాంగ కేసులకు ఆలంబన అవుతున్నాడని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగానూ అసెంబ్లీ న్యాయసలహాదారుగానూ ఆయన పనిచేశారు. వైఎస్‌రాజశేఖర రెడ్డిని బాగా బలపర్చేవారు. తర్వాత వైసీపీతో వెళ్లలేదు గాని కెవిపి రామచంద్రరావుకు సన్నిహితుడుగా పేరుపొందారు. విభజనానంతర కాలంలో జంధ్యాల శంకర్‌ రాజకీయాలు తగ్గించి కేసులపైనే కేంద్రీకరిస్తున్నారు. ఉభయ రాష్ట్రాల మధ్య వివాదాలలో కొన్ని విజయాలు సాధించారు కూడా. పార్టీల అనుబంధాలతో నిమిత్తం లేకుండా కేసులు చేసి మెప్పిస్తున్నారు. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకరరావు తదితరుల విలీన లేఖను సవాలు చేస్తూ తెలుగుదేశం తరపున ఆయన వాదిస్తారని భావిస్తున్నారు. ఇప్పుడు ఆ పార్టీ నాయకుడు రేవంత్‌ రెడ్డి కేసు నడిపించే(గెలిపించే కూడా!) బాధ్యత తీసుకున్నారు. విడతలు విడతలుగా రాజీనామాలు చేస్తే ఆమోదించకుండా అన్నిటినీ కలిపి మూడింట రెండు వంతులు అని లెక్కిస్తే కుదరదని రేవంత్‌ వాదన. చట్టరీత్యా ఇది ఒకె గాని కోర్టులు అంత సులభంగా త్వరగా జోక్యం చేసుకోవు. ఈలోగా పుణ్య కాలం గడిచిపోతుంది. కాకుంటే నైతిక స్థయిర్యం నిలబెట్టడానికి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కేసు ఉపయోగపడుతుంది.జంధ్యాల శంకర్‌ లాగే రామచంద్రరావు, శ్రీరంగారావు, అప్పారిసత్య ప్రసాద్‌ వంటి వారు ఉమ్మడి హైకోర్టులో ప్రజాసమస్యలు రాజకీయ వ్యవహారాలపై కీలక కేసులలో వాదిస్తుంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close