చంద్రబాబు ఐడియాను ఫాలో అయిన రాజస్థాన్ సీఎం…!

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తమ రాష్ట్రంలోకి సీబీఐ ఎంట్రీని బ్యాన్ చేశారు. ఈ మేరకు గతంలో ఉన్న జనరల్ కన్సెంట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం.. రాజస్థాన్ రాజకీయ సంక్షోభంలో ఉంది. తన ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర పన్నిందని.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆడియో రికార్డులను రాజస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో.. అక్రమంగా ఫో‌న్ ట్యాపింగ్ చేశారని… దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని.. చట్టాలను ఉల్లంఘించారని బీజేపీ నేతలు వాదించడం ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు కూడా ఫిర్యాదు చేశారు. అలా ఫిర్యాదు చేయగానే.. ఇలా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాజస్థాన్ ప్రభుత్వాన్ని వివరణ కూడా కోరింది. దీంతో.. సీబీఐని ఉపయోగించుకుని కేంద్రం.. తమను ఇబ్బంది పెడుతుందని భావించారేమో కానీ.. అశోక్ గెహ్లాట్ వెంటనే.. రాజస్థాన్‌లోకి సీబీఐ రాకుండా.. జనరల్ కన్సెంట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ఆడియో టేపుల ఆధారంగా.. ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నారని కేసు నమోదు చేసిన.. రాజస్థాన్ పోలీసులు.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు.. నోటీసులు జారీ చేశారు. అవసరం అయితే.. అరెస్ట్ చేస్తామన్నట్లుగా మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఇప్పటికే.. ఆ టేపుల్లో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కాంగ్రెస్ వారిపై కేసులు నమోదు చేసింది. వారి కోసం.. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పోలీసులు వెదుకుతున్నారు. వారు బీజేపీ పాలిత రాష్ట్రంలో క్యాంపుల్లో ఉన్నారు. దాంతో వారిని పట్టుకోవడం కష్టమవుతోంది. అటు రాజస్థాన్ ప్రభుత్వం తమ పోలీసుల్ని ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనుకుంటోంది. సీబీఐ, ఐటీ లాంటి వాటితో.. రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చాలని.. బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు సీబీఐని రాజస్థాన్ లోకి రాకుండా.. గెహ్లాట్ చేయగలిగారు.

గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు.. ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత.. ఏపీలో ఐటీ దాడులు విస్తృతంగా జరిగాయి. టీడీపీలో వ్యాపారవేత్తలందరిపైనా సోదాలు జరిగాయి. ఆ తర్వాత సీబీఐని కూడా పంపబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. దాంతో చంద్రబాబునాయుడు.. ఏపీలోకి సీబీఐ ఎంట్రీని నిషేధిస్తూ.. జనరల్ కన్సెంట్ ను రద్దు చేశారు. అయితే.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే.. మళ్లీ సీబీఐకి జనరల్ కన్సెంట్ ఇచ్చారు. ప్రభుత్వాలు జనరల్ కన్సెంట్‌ను రద్దు చేసినా.. కోర్టులు ఆదేశిస్తే మాత్రం.. ఎలాంటి అడ్డంకులు లేకుండా విచారణ జరుపుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close