టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా పీవీ కుమార్తె..!

తెలంగాణ రాజకీయాల్లో వస్తున్న మార్పు.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబానికి ఎక్కడ లేని ప్రాధాన్యత తెచ్చి పెడుతోంది. ఉద్యమ సమయంలో పీవీని విమర్శించిన కేసీఆర్ ఇప్పుడు… ఆయనను మహనీయుడ్ని చేస్తున్నారు. ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలు చేస్తున్నారు. ఇప్పుడు.. మరో అడుగు ముందుకేసి…ఆయన కుమార్తెను ఎమ్మెల్సీ చేయాలని ఆలోచన చేస్తున్నారు. పీవీ కుమార్తె సురభి వాణిదేవి… ఎప్పుడూ రాజకీయాల్లో లేరు. ఆమె విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ఇప్పుడు ఆమెను ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం గవర్నర్ కోటాలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆగస్టులో మరో స్థానం ఖాళీ అవుతుంది. అంటే మొత్తం మూడు స్థానాలు ఖాళీ అవుతాయి. అందులో ఒకటి.. పీవీ కుమార్తెకు కేటాయించాలన్న ఆలోచన టీఆర్ఎస్ హైకమాండ్ చేస్తోంది.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. గత సార్వత్రికఎన్నికల సమయంలోనే ఆయన ప్రయత్నం చేశారు కానీ ఫలించలేదు. ఈ సారి మాత్రం.. కొత్త తరహాలో ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే.. ఎప్పుడూ పొగడని పీవీని ఇప్పుడు.. కేసీఆర్ మహానీయుడిగా అభివర్ణిస్తూ.. కాంగ్రెస్‌కు దూరం చేస్తున్నారు. ప్రధానిపదవి నుంచి దిగిపోయిన తర్వాత పీవీని కాంగ్రెస్ పట్టించుకోలేదు. అది బహిరంగరహస్యం. దీన్నే కేసీఆర్ అస్త్రంగా మార్చుకున్నారు. కాంగ్రెస్.. అవమానించిందని.. ఇవ్వాల్సిన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదని దాన్ని తామిస్తున్నామని.. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

కేసీఆర్ చూపిస్తున్న ఆదరణ.. పీవీ కుటుంబసభ్యులనూ ఆకర్షిస్తోది. పీవీ శతజయంతి ఉత్సవాలకు ఎంపీ కేకే నేతృత్వంలో కమిటీ వేసి.. అందులో పీవీ కుటుంబ సభ్యులకూ చోటు కల్పించారు. అదే కాంగ్రెస్ నేతలు కూడా… మాజీ మంత్రి గీతారెడ్డి చైర్మన్‌గా, మాజీ ఎంపీ వీహెచ్‌ గౌరవాధ్యక్షునిగా టీపీసీసీ హడావుడిగా పీవీ శత జయంతి ఉత్సవ కమిటీని వేసింది. అందులో ఉండేందుకు పీవీ కుమారులు, కుమార్తెలు సిద్ధపడలేదు. ఈ పరిణామాలన్నింటితో.. పీవీ కుటుంబం టీఆర్ఎస్‌కు దగ్గరైనట్లేనని చెబుతున్నారు. పీవీ కుమార్తె ఎమ్మెల్సీ స్థానం అంగీకరిస్తే.. ఇక టీఆర్ఎస్.. పీవీని జాతీయ స్థాయిలో తమ వాడిగా ప్రచారం చేసుకునే వ్యూహాన్ని అమలు చేసినా ఆశ్చర్యం లేదనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close