సుశాంత్ ఆత్మహత్య వివాదంలోకి ఉద్ధవ్ కుమారుడ్ని తెచ్చిన కంగన..!

బాలీవుడ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటనను కంగనారనౌత్ మలుపులు తిప్పేస్తోంది. ఆమె ఈ వివాదాన్ని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ధాకరే కుమారుడికి లింక్ పెట్టేసింది. సుషాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న రోజు రాత్రి ఇంట్లో జరిగిన పార్టీకి వచ్చిన వారిలో.. ఓ ముఖ్యమంత్రి కొడుకు ఉన్నారంటూ…బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి సుశాంత్ ఇంట్లో పార్టీ జరిగిందని, దానికి ఓ ప్రముఖుడు హాజరయ్యారని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఆ ప్రముఖుడు ముఖ్యమంత్రి కొడుకేనని.. కంగనా తేల్చేసింది. పేరు నేరుగా చెప్పలేదు అతన్ని `బేబీ పెంగ్విన్‌` అని ప్రేమగా పిలుస్తారని ప్రకటించింది. ఉద్ధవ్ ధాకరే కుమారుడు ఆదిత్య ధాకరేను..సోషల్ మీడియాలో… ట్రోలర్స్ బేబీ పెంగ్విన్ అని పిలుస్తూ ఉంటారు. దీన్నే కంగనా సెటైరిక్‌గా వివరించింది. ఇప్పటికే ఈ కేసు బీహార్ వర్సెస్ మహారాష్ట్ర అన్నట్లుగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుషాంత్ సింగ్ తండ్రి బీహార్‌లో కేసు పెట్టారు. బీహార్ పోలీసులు విచారణ ప్రారంభించారు. సుషాంత్ తండ్రి ప్రధానంగా… రియా చక్రవర్తిపై అనుమానం వ్యక్తం చేశారు. బీహార్ పోలీసులు ముంబైకి వచ్చి విచారణ ప్రారంభించడంతో..కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది.

అయితే ఇప్పటికే సుషాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని ముంబై పోలీసులు తేల్చారు. వైద్యాధికారుల రిపోర్టులు కూడా అంతే వచ్చాయి. సుషాంత్ ఆర్థిక లావాదేవీల్లో తేడాలు ఉండటంతో.. ఈడీ కూడా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ముంబై పోలీసులు… సుషాంత్ ఆత్మహత్యపై సరిగ్గా విచారణ చేయలేదని.. విమర్శలు వినిపిస్తున్న తరుణంలో.. హీరోయిన్ కంగనా రనౌత్ .. ముఖ్యమంత్రి కుమారుని పేరు ప్రస్తావించడం.. ఈ వివాదం మరింత కాలం లైవ్‌లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close