తెలుగు రాష్ట్రాల సీఎంలకు షెకావత్ మళ్లీ మళ్లీ చెబుతున్నారు..!

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త ప్రాజెక్టుల అంశం కేంద్రానికి చిరాకు తెప్పిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అపెక్స్ కౌన్సిల్ భేటీ జరిగే వరకూ..కొత్త ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాశారు. పెండింగ్‌ అంశాల పరిష్కారానికి అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో భేటీ త్వరలో జరగాలని స్పష్టం చేశారు. ఐదో తేదీన జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా పడటం.. పందొమ్మిదో తేదీన ఏపీ సర్కార్ రాయలసీమ ఎత్తిపోతల టెండర్లను ఖరారు చేస్తుందని ప్రచారం జరుగుతున్న సమయంలో…షెకావత్ లేఖ ఆసక్తి రేపుతోంది.

ఏపీ కొత్త ప్రాజెక్టులు కడుతోందని తెలంగాణ… తెలంగాణ కొత్త ప్రాజెక్టులు కడుతోందని ఏపీ అదే పనిగా ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. తెలంగాణ ఎప్పటి నుండో ప్రాజెక్టులు కట్టుకుంటోంది. అయితే.. ఏపీ మాత్రం..ఇప్పుడు కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ కట్టాలనుకుంటోంది. ఇదే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య కొత్త వివాదానికి దారి తీస్తోంది. దీన్ని తెలంగాణలో విపక్షాలు రాజకీయం చేస్తూండగా కేసీఆర్ మాత్రం… సైలెంట్‌గా.. ఆ ప్రాజెక్ట్ టెండర్లను నిలిపివేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేఆర్ఎంబీకి ఫిర్యాదులు చేశారు.

అయితే.. ఏపీ సర్కార్… శ్రీశైలం నుంచి తమకు రావాల్సిన నీటినే తీసుకుంటామని… ఇందు కోసం… ఎత్తిపోతల కట్టుకుంటున్నామని ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదంటోంది. ఈ విషయాన్ని కేఆర్ఎంబీకి..అపెక్స్ కౌన్సిల్ లో చెప్పి అనుమతులు తీసుకుని రాయల్‌గా నిర్మాణం చేపట్టాల్సిన ప్రభుత్వం…పబ్లిసిటీ చేసుకుంటూ.. తెలంగాణలో సెంటిమెంట్ పెరగడానికి కారణం అవుతోంది. ఫలితంగా ప్రాజెక్ట్ చుట్టూ అనేక వివాదాలు ఏర్పడి… ఆపాలనే ఆదేశాలు.. వివిధ విభాగాల నుంచి వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాళ్లు పట్టేసుకుంటున్న వైసీపీ నేతలు -ఎంత ఖర్మ !

కుప్పంలో ఓటేయడానికి వెళ్తున్న ఉద్యోగుల కాళ్లు పట్టేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వారి తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుప్పంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు...

‘పూరీ’ తమ్ముడికి ఓటమి భయం?

విశాఖపట్నం జిల్లాలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి నర్సీపట్నం 'హార్ట్' లాంటిది, ఇక్కడ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్...

మదర్స్ డే @ 200 సంవత్సరాలు

ప్రతి ఏడాది మే రెండో ఆదివారం మదర్స్ డే గా జరుపుకుంటారని మనకు తెలుసు.. అయితే ఈ ప్రతిపాదన మొదలై 200 సంవత్సరాలు అయిందనే విషయం మీకు తెలుసా? వాస్తవానికి 'మదర్స్ డే వేడుకలు'...

కోమటిరెడ్డికి హైకమాండ్ వద్ద రిమార్క్స్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని రేవంత్ రెడ్డి ఉబ్బేస్తున్నారు కానీ ఆయన పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close