50మంది అతిథులు.. 200 కుటుంబాల‌కు లైవ్‌లో

రానా – మిహిక‌ల పెళ్లి అత్యంత సింపుల్‌గా, ప‌రిమిత‌మైన బంధుమిత్రుల స‌మ‌క్షంలో, క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జ‌రిగిపోయింది. కొద్దిసేప‌టి క్రిత‌మే.. జిల‌క‌ర్ర – బెల్లం తంతు ముగిసింది. ఇప్పుడు రానా – మిహిక‌లు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఒక్క‌టైపోయారు. క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జ‌రుగుతున్న పెళ్లి కావ‌డంతో.. ద‌గ్గుబాటి కుటుంబం అన్ని ముంద‌స్తు జాగ్ర‌త్త‌లూ తీసుకొంది. కేవ‌లం 50 మంది అతిథుల‌కే ఆహ్వానాలు అందాయి. అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే ఈ వివాహ వేడుక‌లో పాలుపంచుకున్నారు. టెక్నాల‌జీ పుణ్య‌మా అని రెండొంద‌ల కుటుంబాలు ఈ పెళ్లిని లైవ్ లో వీక్షించాయి. వ‌ర్చువ‌ల్ రియాలిటీ టెక్నాల‌జీతో ఈ పెళ్లిని ద‌గ్గుబాటి కుటుంబ స‌భ్యులు ఇళ్ల‌లోనే ఉండి వీక్షించారు. వారం రోజుల నుంచీ.. రామానాయుడు స్టూడియోలో సినిమా షూటింగుల‌న్నీ ఆపేశారు. సినిమాకి సంబంధించిన ఏ ఒక్క కార్య‌క్ర‌మ‌మూ జ‌ర‌గ‌లేదు. స్టూడియో మొత్తం శానిటైజేష‌న్ చేశారు. పెళ్లికి హాజ‌రైన ప్ర‌తీ అతిథికీ ఓ యాప్ ఇన్ స్టాల్ చేయించి, అందులో ఆరోగ్య స‌మాచారాన్ని నిక్షిప్తం చేయించారు. కొద్దిసేప‌టి క్రితం అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్‌లు వివాహ వేడుక‌కు హాజ‌రై వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ప్ర‌భాస్ కూడా పెళ్లికి హాజ‌ర‌వుతాడ‌ని తెలుస్తోంది. క‌రోనా బారీన ప‌డ‌డంతో రాజ‌మౌళి కుటుంబం ఈ పెళ్లికి హాజ‌ర‌వ్వ‌డం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లోక్ సభ ఎన్నికలు : బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..?

లోక్ సభ ఎనికల్లో అంచనాలు తలకిందలు కానున్నాయా..? అసలు ఏమాత్రం ప్రభావం చూపదని అంచనా వేసిన బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..? కేసీఆర్ బస్సు యాత్రతో జనాల మూడ్ చేంజ్ అయిందా..? అంటే...

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close