అమరాతి రైతుల కోసం లాయర్ పరాశరన్ ..!

లాయర్ పరాశరన్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు.. కానీ అయోధ్య రామమందిరం కోసం… దశాబ్దాల పాటు సుప్రీంకోర్టులో పోరాడిన లాయర్ పరాశరన్ అంటే.. తెలియని వారు ఉండరు. 90 ఏళ్లు దాటినా కూడా ఆయన న్యాయం కోసం పని చేస్తూనే ఉన్నారు. వయసు మీద పడినందున ఆయన కూర్చుని వాదనలు వినిపించవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పినా… దాన్ని సున్నితంగా తిరస్కరించి ఆ వయసులోనూ నిల్చునే వాదనలు వినిపించేవారు. అయోధ్య రామాలయ నిర్మాణం సాకారం కావడానికి కారకుల్లో ఒకరు అయిన పరాశరన్ ఇప్పుడు.. న్యాయం కోసం అమరావతి రైతుల వైపు నిలబడాలని నిర్ణయించుకున్నారు.

రైతుల తరపున సుప్రీంకోర్టులో వాదించేందుకు అంగీకరించారు. రెండు రోజుల కిందట జరిగిన రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాల విషయంలో జరిగిన వాదనల్లో.. పరాశరన్ కూడా పాల్గొన్నారు. అమరావతి రైతులు.. తమకు న్యాయం కోసం ఢిల్లీ స్థాయిలో పోరాడుతున్నారు. సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్లను పెట్టుకుంటే పెద్ద ఎత్తున ఫీజు ముట్టచెప్పాల్సి ఉంటుంది. అందుకే రైతులు.. న్యాయం కోసం పోరాడే ప్రముఖ న్యాయవాదుల్ని కలిసి.. తమకు ప్రభుత్వం తెచ్చి పెట్టిన కష్టం గురించి.. చేస్తున్న అన్యాయం గురించి వివరించి… పెద్ద మొత్తంలో ఫీజు ఇచ్చుకోలేమని.. వాదించాలని కోరుతున్నారు. కొంత మంది లాయర్లు కేసు తీవ్రత దృష్ట్యా వాదించడానికి అంగీకరిస్తున్నారు.

పరాశరన్ కూడా.. అమరావతి రైతుల కష్టాలు విని… రూపాయి ఫీజు తీసుకుని.. వారి తరపున సుప్రీంకోర్టులో వాదించేందుకు సిద్ధమయ్యారని రైతులు చెబుతున్నారు. పరాశరన్‌తో పాటు కొంత మంది లాయర్లు.. రాజధాని రైతుల కోసం సుప్రీంకోర్టులో వాదించనున్నారు. మిగతా వారి సంగతేమో కానీ.. పరాశరన్ అనే పేరు మాత్రం.. అమరావతి రైతులకు భరోసా ఇస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close