కంట్రోల్ పూరీ.. కంట్రోల్‌

పాడ్ కాస్ట్ పేరుతో పూరి జ‌గ‌న్నాథ్.. త‌న భావాల్ని అభిమానుల ముందుకు తీసుకొస్తున్నాడు. అవన్నీ పూరి సినిమాల్లో ని డైలాగుల్లా బాగా పేలుతున్నాయి. వాటిలో పూరియిజం అనేది ఇంకాస్త స్ప‌ష్టంగా వ్య‌క్తం అవుతోంది. పూరికి ఎందుకంత అభిమానులున్నారో… ఈ మాట‌లు వింటే అర్థ‌మ‌వుతుంది. అయితే.. పాడ్ కాస్ట్‌లోనూ అప్పుడ‌ప్పుడూ పూరి కాస్త కంట్రోల్ త‌ప్పుతున్నాడ‌నిపిస్తోంది. పూరి మాట‌లు ఓ వ‌ర్గం మ‌నోభావాల్ని నొచ్చుకునేలా చేస్తున్నాయి..

ఆమ‌ధ్య పేద‌రికం గురించి చాలా బాగా మాట్లాడాడు పూరి. పేద‌లుగా బ‌త‌క్కండి.. అంటూ పిలుపునిచ్చాడు. పూరి మాట‌లు స్ఫూర్తి నింపేవే. కానీ.. ఓ చోట మాత్రం `రేష‌న్ కార్డులున్న‌వాళ్లంద‌రికీ ఓటు హ‌క్కు తీసేయండి` అన్నాడు. ఇవ‌న్నీ ఓ వ‌ర్గాన్ని బాధించే మాట‌లే. రేష‌న్ కార్డు ఉన్నంత మాత్ర‌న ఓటు హ‌క్కు ఉండ‌దా? అంటే డ‌బ్బున్న వాళ్లే ఓటు వేయాలా? అంటూ పూరిని ఓ వ‌ర్గం విమ‌ర్శిస్తోంది.

ఇప్పుడు `పెళ్ల‌యిన ఆడ‌వాళ్లంద‌రీ ఓ విన్న‌పం` అంటూ మ‌రోటి వ‌దిలాడు. మొగుడు ఎంత ఏడిస్తే.. అంత ఏడ‌వండి.. అన్న‌ట్టు సాగింది పూరీ బాతాఖానీ. ఇవ‌న్నీ విన‌డానికి స‌ర‌దాగా ఉన్నా.. ఆలోచిస్తే.. `ఆడాళ్లూ. మీ ఖ‌ర్మ ఇంతే` అన్న అర్థం ధ్వ‌నిస్తోంది. లైట్ గా తీసుకున్న‌వాళ్లూ, నిజానిజాలు ఆలోచించేవాళ్లూ..పూరి మాట‌లు ఎంజాయ్ చేస్తుంటే, ఇంకొంత మంది పెడార్థాలు తీస్తూ – ఫీల‌వుతున్నారు.

“అంద‌రి పెళ్లాల‌కంటే ఎక్కువ ఏడ్చింది రాముడి పెళ్ల‌మే.
ప్ర‌తీ దేవుడూ వాళ్ల భార్య‌ని ఏడిపించిన‌వాళ్లే“ అంటూ ఈ టాపిక్‌లోని దేవుడినీ లాగేశాడు పూరి. అవ‌న్నీ నిజాలు కాకుండా పోవు. కానీ.. ఇంత‌టి సెన్సిటివ్ విష‌యాన్ని చాలా జాగ్ర‌త్త‌గా డీల్ చేయాలి క‌దా. పూరి కాస్త కంట్రోల్ లో ఉండి మాట్లాడితే బాగుండేది. పూరి ఎప్పుడూ అంతే. సూటిగా మాట్లాడేస్తాడు. అదే అభిమానుల్ని సంపాదించి పెట్టింది. ఇప్పుడు అదే త‌ల‌నొప్పుల్నీ తీసుకొస్తోంది. ఇక ముందైనా పూరి కాస్త కంట్రోల్ లో ఉంటాడేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close