రాజధాని రైతుల కోసం జనసేన “కౌంటర్”

రాజధాని రైతులకు అండగా ఉంటామని మొదటి నుంచి చెబుతున్న జనసేన పార్టీ.. ఆ దిశగా న్యాయపోరాటంలో పాలు పంచుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టులో జనసేన పార్టీ తరపున కౌంటర్ దాఖలు చేయాలని నిర్ణయించుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాజకీయ వ్యవహారాల కమిటీతో పాటు ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అమరావతి విషయంలో జనసేన మొదట్నుంచీ స్పష్టంగా ఉందన్నారు. పర్యావరణ హిత రాజధాని కావాలని మొదటి నుంచి చెబుతున్నామని చెప్పుకొచ్చారు.

ఎన్నికలకు ముందు అమరావతి రాజధానిగా ఉంటుందని భరోసా ఇచ్చి ఆ తర్వాత మాట మార్చాలని ఆరోపిస్తూ.. రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సీఎం జగన్ తో పాటు మిగిలిన అన్ని పార్టీలకూ నోటీసులు జారీ చేసింది. అన్ని రాజకీయ పార్టీలకూ.. కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఇవ్వడంతో.. తాము కూడా.. కౌంటర్ దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయించుకుంది. ఇప్పటికే… హైకోర్టు బీజేపీకి కూడా నోటీసులు ఇచ్చినందున ఆ పార్టీ కూడా విడిగా కౌంటర్ దాఖలు చేయనుంది. జనసేన తన అభిప్రాయాన్ని కోర్టుకే వెల్లడించనుంది.

అమరావతికి మద్దతుగా మొదట్లో దూకుడుగా ఉన్న పవన్ కళ్యాణ్.. బీజేపీతో పొత్తు తర్వాత సైలెంటయ్యారు. దీంతో బీజేపీతో కలిసి ఆయన పొలిటికల్ గేమ్ ఆడుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడ్ని చేసిన తర్వాత అమరావతి విషయం లో ఆ పార్టీ స్టాండ్‌పై క్లారిటీ వచ్చేస్తోంది. దాంతో పవన్ ఏం చేస్తారన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఇప్పటి వరకూ ఏమీ చెప్పకపోయినా… న్యాయపోరాటానికి తమ వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తాజా ” కౌంటర్”తో తేలిపోయిందని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close