సాక్ష్యాలివ్వాలని చంద్రబాబుకు పోలీసుల నోటీసులు..!

చిత్తూరు జిల్లా పుంగనూరులో దళిత యువకుడు ఓంప్రతాప్ మృతి విషయంలో ఆధారాలు ఇవ్వాలంటూ… పోలీసులు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. అదీ కూడా సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం.. ఇచ్చారు. నోటీసు అందిన వారం రోజుల లోపు నేరుగా తమ కార్యాలయానికి హాజరై సమాచారం ఇవ్వాలని మదనపల్లి సబ్ డివిజనల్ పోలీసు అధికారి పేరు మీదుగా నోటీసులు పంపించారు. ఈ నోటీసుల్లో.. “పెద్దిరెడ్డి బెదిరింపులతోనే.. డీజీపీకి చంద్రబాబు లేఖ” అనే పేరుతో ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు.

అందులో ఆరోపించినవాటికి ఆధారాలు కావాలని… లేఖలో పోలీసులు పేర్కొన్నారు. గత వారం.. తెలుగుదేశం పార్టీ నేతలు.. దళిత యువకుడు ఓం ప్రతాప్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ అరెస్టులు చేశారు. అదే రోజున.. ఎస్పీ ఓంప్రతాప్ కుటుంబాన్ని పరామర్శించారు. అప్పుడే పెద్దిరెడ్డి బెదిరింపుల వల్లే ఓం ప్రతాప్ చనిపోయాడని ఆరోపించిన వారికి నోటీసులు పంపుతామని హెచ్చరించారు. ఆ ప్రకారం.. చంద్రబాబుకు నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. అయితే.. చంద్రబాబు నేరుగా.. డీజీపీకే లేఖ రాశారు.

డీజీపికి లేఖ రాసినట్లుగా పేపర్లో వచ్చిన వార్త ఆధారంగా చంద్రబాబుకు నోటీసులు పంపడం… ఈ మొత్తం వ్యవహారంలో ఓ ట్విస్ట్. ఓం ప్రతాప్ మృతి వ్యవహారంలో ఇప్పటికీ.. చిత్తూరు జిల్లాలో అనేకరకాల చర్చోపర్చలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని దూషించడమే… ఆయన మరణానికి కారణం అన్న చర్చ జరుగుతోంది. తీవ్రమైన ఆరోపణలు వస్తున్న సమయంలో.. పోలీసులు ఆధారాలు అంటూ.. ప్రతిపక్ష నేతకు నోటీసులు జారీ చేయడం..జకీయ ఆరోపణలకు పోలీసులు స్పందించడం.. వివాదాస్పదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close