ఏపీలో రిటైరైన ఉద్యోగులకు ప్రతీ నెలా పెన్షన్ టెన్షనే…!

ఆంధ్రప్రదేశ్‌లో మెజార్టీ ఉద్యోగులకు జీతాలు అందాయి. కానీ పెన్షన్లు మాత్రం ఇంకా అందలేదు. కారణం .. నిధులు లేకపోవడమే. ఒకటో తేదీన మంగళవారం రావడంతో.. ఆర్బీఐలో బాండ్లను వేలం వేయడం ద్వారా రూ. మూడు వేల కోట్లను తీసుకొచ్చిన ప్రభుత్వం.. జీతాలు చెల్లించింది. కానీ పెన్షన్ల చెల్లింపు కోసం.. ఆ మెత్తం సరిపోలేదు. ఉద్యోగుల జీతాల కోసం దాదాపుగా రూ. నాలుగు వేల కోట్లు.. పెన్షన్ల కోసం.. రూ. పదిహేను వందల కోట్లు నెలకు అవసరం అవసరం అవుతాయి. ఉద్యోగల జీతాలకు సరిపెట్టినా.. పెన్షన్ల కోసం.. రూ. పదిహేను వందల కోట్లు ఎక్కడి నుంచి తేవాలా అని ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం వద్ద నిధులు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేవు. ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్తే… ఆర్బీఐ రూ. పదిహేను వందల కోట్లు ఇస్తుంది. కానీ సీఎం జగన్ మాత్రం.. ఓవర్ డ్రాఫ్ట్ లాంటి అతి స్వల్ప సమయం ఉండే అప్పులపై ఆసక్తిగా లేరు. దీంతో… వేస్ అండ్ మీన్స్ కింద ఆర్బీఐ నుంచి సేకరించాలని ఆర్థిక శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ నిధులను సేకరించి శుక్రవారం తర్వాత పెన్షనర్లకు పెన్షన్లు అందించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ ఏదైనా ఇబ్బంది వస్తే.. మంగళవారం మళ్లీ బాండ్ల వేలం వేసి… నిధులు సమీకరించి ఇచ్చే అవకాశం ఉంది.

కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షనర్లకు ప్రతీ నెలా టెన్షన్ తప్పడం లేదు. ఆలస్యంగా రావడమే కాదు… లాక్ డౌన్ పేరుతో రెండు నెలలు కోత విధించారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఇస్తున్నా.. సమయానికి రావడం లేదు. గత నెలలో 12వ తేదీ వరకు పెన్షన్లు ఇస్తూనే ఉన్నారు. ఈ సారి కూడా అలాంటి పరిస్థితే ఏర్పడింది. రిటైరైన వారికి పెన్షనే ఆధారంగా ఉంటుంది. అనేక సమస్యలు ఉంటాయి. తమ జీవితాంతం సర్వీస్ చేసిన వారికి ప్రభుత్వం ఇలా చేయడం కరెక్ట్ కాదన్న వాదన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ చివరి ప్రయత్నాలు : ఫేక్ ఎడిట్లు, మార్ఫింగ్‌లు, దొంగ నోట్లు, దాడులు

ఎన్నికల్లో గెలవాలంటే ఎవరైనా ప్రజలతో ఓట్లేయించుకోవడానికి చివరి క్షణం వరకూ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ వైసీపీ డీఎన్‌ఎలో ప్రజల్ని పరిగణనలోకి తీసుకోవడం అనేదే ఉండదు. గెలవాలంటే తమకు వేరే...

కాంగ్రెస్ గూటికి శ్రీకాంతా చారి తల్లి… ఎమ్మెల్సీ ఖాయమా..?

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను...

పవన్ కళ్యాణ్ వెంటే బన్నీ

జనసేనాని పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంచుకున్న మార్గం తనకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు....

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close