ఎంపీల భేటీ ఏర్పాటు చేయాలని జగన్‌కు ఆర్ఆర్ఆర్ లేఖ..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతీ రోజూ రచ్చబండ పేరుతో ప్రెస్‌మీట్ పెట్టి రచ్చ చేస్తున్న రఘురామకృష్ణరాజు .. వైసీపీ ఎంపీగా మాత్రం సీరియస్‌గా పని చేస్తున్నారు. ఆయన తన పార్టీ కోసం.. ప్రజల తరపున పోరాడేందుకు ఏ చిన్న అవకాశాన్ని వచ్చినా వదులుకోవాలనుకోవడం లేదు. ఈ సారి ఆ అంశంపై నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున.. కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాలను డిమాండ్ చేయడానికి.., పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అంశాలను ఖరారు చేసుకోవడానికి వెంటనే.. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖ రాశారు.

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు.. ప్రతీ పార్టీ .. ఎంపీలతో సమావేశం నిర్వహిస్తుంది. పార్లమెంటరీ పార్టీ భేటీని నిర్వహించి.. ఎజెండాను ఖరారు చేసుకుంటుంది. ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా.., పార్లమెంట్‌లో తమ రాష్ట్ర సమస్యల గళం వినిపించడానికి ప్రాధాన్యం ఇస్తారు. గతంలో వైసీపీ కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహించింది. కారణం ఏమిటో కానీ.. ఈ సారి మాత్రం.. అలాంటి సమావేశాలు నిర్వహించలేదు. కరోనా కారణంగా నేరుగా సమావేశం నిర్వహించకపోయినా… ఆన్‌లైన్‌లో వర్చువల్‌గా అయినా సమావేశం నిర్వహించాలని రఘురామకృష్ణరాజు కోరుతున్నారు. ఒక వేళ.. సమావేశం నిర్వహిస్తే.. తన వాదన వినిపించడానికి .. తన ఆలోచనలను వివరించడానికి ఆయన సిద్ధమవుతున్నారు.

రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కొన్ని అంశాలు కేంద్రం దృష్టికి రాలేదని… ఇందుకు అధికారుల అలసత్వమే కారణమని రఘురామకృష్ణరాజు లేఖలో చెప్పుకొచ్చారు. ఏ అంశాలను లేవనెత్తాలి అనే అంశంపై ముందుగానే నోట్‌ను అందజేయాలన్నారు. సమావేశాలకు ముందు గతంలో సీఎంలు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సమావేశం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందని గుర్తుచేశారు. అయితే.. ఒక వేళ సీఎం జగన్ సమావేశం నిర్వహించినా రఘురామకృష్ణరాజుకు మాత్రం ఆహ్వానం అందే అవకాశం లేదని వైసీపీలోనే చెప్పుకుంటూ ఉంటారు. ఈ విషయం ఆర్ఆర్ఆర్ కి తెలియకేం కాదు. కానీ.. ఆయన వైసీపీ నాయకత్వం లోపాలను దనదైన శైలిలో ఎత్తి చూపుతున్నారని అనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close