విభజన చట్టంలో “ఒకే రాజధాని” అని లేదని కేంద్రం అఫిడవిట్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మూడు రాజధానుల అంశానికి సంబంధించి కేంద్రం తన వంతు ఎంత సహకారం కావాలో అంత సహకారం అందిస్తోంది. విభజన చట్టాన్ని ఉల్లంఘించి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని.. విభజన చట్టంలో రాజధాని అని మాత్రమే ఉందని.. కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్ర చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే.. రంగంలోకి దిగిన కేంద్రం.. ఈ అంశంపై ప్రభుత్వానికి అనుకూలంగా క్లారిటీ ఇచ్చింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చట్టంలో ఉందని హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.

రాజధాని విషయంలో కేంద్రానికి పాత్ర ఉందని.. విభజన చట్టం, శివరామకృష్ణన్ కమిటీ వంటి వాటిని ప్రస్తావిస్తూ.. కొంత మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని లేదా.. రాజధానులు అంశంలో తమకేమీ సంబంధం లేదని స్పష్టం చేసింది. పిటిషనర్లు కేవలం అపోహతోనే ఉన్నారని.. కేంద్ర హోంశాఖ తెలిపింది. విభజన చట్టం ప్రకారం చూస్తే.. మూడు రాజధానులు పెట్టుకోవచ్చని కేంద్రం నేరుగా హైకోర్టుకు.. ఈ అఫిడవిట్ ద్వారా చెప్పినట్లయింది.

కేంద్ర ప్రభుత్వ చట్టంలో రాజధాని అని మాత్రమే ఉంది. “రాజధాని లేదా రాజధానులు” అని లేదు. శివరామకృష్ణన్ కమిటీ కూడా మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు రాలేదు. ఇవన్నీ తెలిసినప్పటికీ.. కేంద్రం కొత్తగా “రాజధాని లేదా రాజధానులు” పదం తీసుకొచ్చి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం.. న్యాయవర్గాలను సైతం విస్మయ పరుస్తోంది. మూడు రాజధానులకు పూర్తి స్థాయిలో సహకారం అందించే లక్ష్యంతోనే కేంద్రం.. ఇలా చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విబజన చట్టంలో రాజధాని అని మాత్రమే ఉంటే.. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మాత్రం.. దానికి “రాజధాని లేదా రాజధానులు” అనే భాష్యం చెప్పడం… కొత్త మలుపుగా అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close