ఆర్కే పలుకు : గుళ్లపై దాడులు బీజేపీ – వైసీపీ రాజకీయమే..!

ఓ మర్డర్ జరుగుతుంది..! హంతకుడెవరో చాలా మందికి తెలియుదు..! కానీ తెలివైన పోలీస్ ఆఫీసర్ వచ్చి.. ఆ మర్డర్ చేయడం వల్ల ఎవరికి లాభం చేకూరుతుందో ఓ లిస్ట్ తీస్తాడు. వెంటే హంతకుడు దొరికిపోతాడు. ఇది సినిమాలో ఓ సీన్. అచ్చంగా ఇంతే కాకపోయినా… ఇదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ – వైసీపీల అనధికార కూటమిని.. ఆలయాల ధ్వంసం కేసులో ప్రధానంగా అనుమానిస్తున్నారు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. తనదైన రాజకీయ విశ్లేషణలతో ఆ వారం వారం రాసే… వారాంతపు ఆర్టికల్ కొత్తపలుకులో ఈ సారి ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడుల అంశాల్ని విశ్లేషించారు..!

అసలు ఏపీలో ఆలయాలపై ఎప్పుడూ లేని విధంగా దాడులు ఎందుకు జరుగుతున్నాయి..? ప్రభుత్వం ఎందుకు ఇంకా రెచ్చగొట్టాలనుకుంటోంది..? ఒక్కటంటే.. ఒక్క కేసులోనూ నిందితుల్ని కనీసం అరెస్ట్ చేయలేదెందుకు..? మోడీని అన్ని మాటలన్నా బీజేపీ స్పందన అంత లైట్‌గా ఉంటుందెందుకు..? సోము వీర్రాజే గుళ్లపై దాడులు చేయిస్తున్నారని అన్నా ఆయన నోరు మెదపలేదేందుకు..? ఈ దాడులతో రాజకీయంగా బలపడటానికి బీజేపీ ఏం చేస్తోంది..? ఈ ప్రశ్నలన్నింటికీ ఆర్కే సమాధానం చెప్పారు. అదీ కూడా.. కాదనలేనంత లాజికల్‌గా ఆ సమాధానం ఉంది.

ముందుగా చెప్పినట్లుగా సినిమాలో చెప్పినట్లుగా ఎవరైనా హత్యకు గురైతే.. దాని వల్ల ఎవరికి లాభం కలుగుతుందో వారే ప్రధాన అనుమానితులుగా భావిస్తే.. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రధానంగా అనుమానించాల్సింది బీజేపీనే. అయోధ్య దగ్గర్నుంచి ఆ పార్టీ విధానమే అది. ఏ రాష్ట్రంలో పట్టు సాధించాలనుకున్నా అక్కడ ఆలయాలు ఏదో విధంగా ప్రచారంలోకి వస్తాయి. శబరిమల దగ్గర్నుంచి టీడీపీ హయాంలో తిరుమల వరకు చాలా వచ్చాయి. వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏపీ వంతు. అయితే… ఇదంతా బీజేపీ చేయిస్తున్నదేం కాదని ఆర్కే అంటున్నారు. అధికార పార్టీ తల్చుకుంటే… గుళ్లపై దాడి చేస్తున్న వారిని నిమిషాల్లో పట్టుకోగలరు. పట్టుకోవడం లేదు అంటే.. గూడుపుఠాణి ఉన్నట్లేనంటున్నారు.

మత విద్వేషాల వల్ల బీజేపీ రాజకీయం చేస్తుంది. హిందువుల ఓట్లను ఓ వైపు పోలరైజ్ చేస్తుంది. అంటే ప్రధానంగా విడిపోయేది టీడీపీ ఓటు బ్యాంక్. ఈ పరిణామం వల్ల క్రిస్టియన్లు, ముస్లింలలు వైసీపీ వైపు సంఘటితం అవుతారు. దళితులపై వరుస దాడులతో ఆ వర్గంలో నెలకొని ఉన్న అసంతృప్తి కారణంగా ఇది వైసీపీకి కూడా కీలకమే. అందుకే.. బీజేపీ-వైసీపీ కలిసే.. ఏపీలో మత రాజకీయాలు ప్రారంభించాయని.. గుళ్లపై దాడులు చేస్తున్నారని ఆర్కే విశ్లేషించారు. ఇది అబద్దం అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే… రథాలు తగలబడినా నిందితుల్ని పట్టుకోలేకపోవడం అనే చిన్న లాజిక్ చాలంటున్నారు.

మొత్తానికి ఆర్కే చాలా అంశాలు చెప్పారు కానీ.. సూటిగా సుత్తి లేకుండా చెప్పాలనుకున్నది మాత్రం ఏపీలో… మత రాజకీయాలకు.. బీజం వేసి.. టీడీపీ ఓటు బ్యాంక్‌ను చీల్చాలని.. వైసీపీ – బీజేపీ కలసి రాజకీయం ప్రారంభించాయని. ఆ దిశగానే హిందూత్వంపై దాడి జరుగుతోందని..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close