రకుల్‌ను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఎందుకు ప్రయత్నిస్తారు..!?

బాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయాన్ని హైదరాబాద్‌కు చుట్టబెట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూండటంతో.. ఆమె పేరును లింక్ చేసి రాజకీయ ఆరోపణలు ప్రారంభించారు. కాంగ్రెస్ నేత సంపత్ కుమార్.. ఈ విషయంలో చిత్రమైన ఆరోపణలు చేస్తూ.. మీడియాకు లేఖ పంపారు. ముంబై డ్రగ్స్‌ కేసుతో హైదరాబాద్‌కు లింకులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. గతంలో హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసును తొక్కేశారని గుర్తు చేశారు. అంతటితో ఆగలేదు.. రకుల్‌ను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఆరోపించారు.

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో చాలా మంది పేర్లు ఉంటే.. ఒక్క రకుల్‌ను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఎందుకు ప్రయత్నిస్తున్నారో సంపత్ కుమార్ తన లేఖలో వివరించలేదు. తెలుగు సినిమాల్లో నటించినంత మాత్రాన రకుల్ ను కాపాడాలని.. తెలంగాణ ప్రభుత్వం అనుకోదుగా..! పైగా… రకుల్ తాను డ్రగ్స్ తీసుకున్నానని చెప్పడం లేదు. రెండేళ్ల కిందట.. చాట్ చేశానని చెబుతోంది. అంతకు ముందు ఎన్సీబీ వద్ద ఆధారాలు కూడా లేవని … దర్యాప్తు అధికారులే చెబుతున్నారు. అటువంటప్పుడు.. కాపాడటం అనే ప్రశ్న ఎలా వస్తుందో.. సంపత్.. ఏ ఉద్దేశంతో ఈ లేఖ రాశారో స్పష్టత లేకుండా పోయింది.

తనపై ఇలాంటి రాజకీయాలు చేస్తారని రకుల్ ముందుగానే గ్రహించింది ఏమో కానీ.. డ్రగ్స్ కేసు విషయంలో తన పేరుతో ఎలాంటి వార్తలు వేయకుండా మీడియాను నియంత్రించాలని మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసును ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టేశారు. బహుశా.. ఈ విషయాన్ని హైలెట్ చేయడానికి సంపత్ కుమార్ రకుల్ పేరును ఉపయోగించుకుంటున్నారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close