రాష్ట్రపతికి ఫిర్యాదు పెండింగ్.. నేడో రేపో మరోసారి ఢిల్లీకి జగన్..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టే ఆలోచన చేస్తున్నారు. ఈ సారి ఆయన రాష్ట్రపతిని కలవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరోసారి ప్రధానమంత్రిని కూడా కలిసేందుకు అపాయింట్‌మెంట్ అడినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు .. చీఫ్ జస్టిస్ కావాల్సిన మరో న్యాయమూర్తిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ లేఖ రాయడమే కాదు.. ఆ లేఖను ప్రత్యేకంగా ప్రభుత్వ సలహాదారుతో మీడియా ముందు చెప్పించి.. మీడియాకు పంచి..అనుకూలమైన జాతీయమీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించడం ఢిల్లీ వర్గాల్లో కూడా సంచలనం సృష్టిస్తోంది. తీవ్రమైన అభియోగాలు ఉన్న నిందితుడు న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్నారన్న అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ ఏర్పడుతోంది.

అయితే తన వాదనను జగన్ మరింత బలంగా వినిపించాలని నిర్ణయించుకున్నారు. అందుకే రాష్ట్రపతిని.. మరోసారి ప్రధానిని కలవాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సీజేఐకి రాసిన లేఖను.. రాష్ట్రపతికి ఇచ్చి… రమణను.. న్యాయమూర్తి పదవి నుంచి తొలగించాలని కోరతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశంపై ప్రధానితోనూ మరోసారి సమావేశం అవ్వాలని జగన్ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్‌మెంట్‌లను బట్టి.. జగన్ ఏ క్షణమైనా మరోసారి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీ పెద్దలు ఢిల్లీలో జగన్ రాసిన లేఖను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

అనుకూలంగా ఎవరు మాట్లాడితే వారితో.. మీడియాలో ఇంటర్యూలు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే…న్యాయవ్యవస్థపై విమర్శలు చేయడం… సబ్ జ్యూడిస్ అవుతుంది కాబట్టి.. చాలా మంది ఆలోచిస్తున్నారు. కొంత మంది మాత్రం.. ముందుకు వస్తున్నారు. అలా ముందుకు వచ్చేవారితో జస్టిస్ రమణపై విమర్శలు చేయిస్తున్నారు. మరోసారి జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత న్యాయవ్యవస్థపై ఆయన యుద్ధం మరో రేంజ్‌కి చేరే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డ‌బుల్ ఇస్మార్ట్‌: ఈసారి ‘చిప్‌’ ఎవ‌రిది?

పూరి జ‌గ‌న్నాథ్ రాసుకొన్న‌ డిఫరెంట్ క‌థ‌ల్లో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఒక‌టి. హీరో మెద‌డులో చిప్ పెట్టి - దాని చుట్టూ కావ‌ల్సినంత యాక్ష‌న్, డ్రామా, వినోదం న‌డిపించేశారు. ఆ పాయింట్ కొత్త‌గా అనిపించింది....

ఉరవకొండ రివ్యూ : మరోసారి పయ్యావుల కేశవ్‌కే కిరీటం

ఉరవకొండలో పయ్యావుల గెలిస్తే టీడీపీ ఓడిపోతుందన్న ఓ ప్రచారాన్ని ఆయన ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. కానీ పయ్యావుల రాజకీయాల్లోకి వచ్చిన 1994లో టీడీపీ విజయం సాధించింది. పయ్యావుల కూడా గెలిచారు. ఆ తర్వతా...

చెల్లిని కించపర్చి జాతీయ మీడియాలో జగన్ నవ్వులపాలు

జాతీయ మీడియాకు జగన్ ఇచ్చిన ఇంటర్యూలు నవ్వుల పాలయ్యాయి. ఇతర విషయాల సంగతేమో కానీ చెల్లి షర్మిలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీహార్ లో పురుషాహంకారం ఉండే నేతలు కూడా...

పోస్టల్ బ్యాలెట్స్ కూడా రీపోలింగ్ – ఇదేం ఎన్నికల నిర్వహణ ?

ఎన్నికల నిర్వహణ ఎంత అసమర్థుల చేతుల్లో ఉందో తెలిపే ఘటన ఇది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఉద్యోగులకు డమ్మీ బ్యాలెట్లు ఇచ్చారు. రోజంతా ఉద్యోగులు కష్టపడి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close