రజనీకాంత్‌కు వార్నింగ్ ఇచ్చిన హైకోర్టు

రజనీకాంత్ గుప్త దానాలు చేస్తూంటారని ఆయన అభిమానులు చెబుతూంటారు. బహిరంగంగా ఆయన దేనికీ పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే అప్పుడప్పుడూ.. ఆయన పిసినారితనంపై మాత్రం కథనాలు వస్తూంటాయి. వివిధ సందర్భాల్లో నటులు రూ. కోట్లలో విరాళిస్తూంటే… రజనీకాంత్ రూ. లక్షల్లోనే ఇస్తూంటారు. ఒక్కో సారి అదీ కూడా ఇవ్వరు. రజనీకి ప్రచారం ఇష్టం ఉండదని.. గుప్త దానాలు చేస్తూంటారని.. ఆయన అభిమానులు ప్రచారం చేస్తూంటారు. అయితే.. తాజాగా ఆయనకు రూ. ఆరున్నర లక్షల విషయంలో కోర్టు వార్నింగ్ ఇచ్చిన వ్యవహారం మరోసారి రజనీ పిసినారితనం విషయం చర్చకు వస్తోంది.

రజనీకాంత్‌కు చెన్నైలో రాఘవేంద్ర పేరుతో ఓ భారీ కల్యాణమండపం ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. అంత ఖరీదైన కల్యాణమండపానికి.. సహజంగానే చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ దానికి తగ్గట్లుగా పన్ను వేస్తుంది. అలా ఆరు నెలలకు.. ఆ పన్ను రూ. ఆరున్నర లక్షల వరకూ అయింది. దాన్ని కట్టమని నోటీసులు పంపించారు. అయితే.. ఈ పన్ను వేయడం రజనీకాంత్‌కు నచ్చలేదు. ఆరు నెలల పాటు లాక్ డౌన్ విధించి…తన కల్యాణమండపానికి పన్ను విధిస్తారా.. అని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. రజనీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినందుకు జరిమానా విధించాల్సి ఉంటుందని న్యాయమూర్తి రజనీ లాయర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని చెప్పి.. జరిమానా నుంచి రజనీ లాయర్ తప్పించుకున్నారు. ఆస్తి పన్ను విషయంలో ఒక్క రజనీకే కాదు.. ప్రజలందరికీ ఒకే నిబంధనలు ఉంటాయి. మరి రజనీకాంత్ మాత్రం ఆరున్నర లక్షల పన్నుకే ఎందుకు హైకోర్టుకెళ్లారనేది చాలా మందికి అర్థం కాని విషయం. కొంత మంది రజనీ ఆర్థిక వ్యవహారాలు ఎంత కఠినంగా ఉంటాయో ఈ ఘటన చెబుతుందని.. అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

ఓటేస్తున్నారా ? : ఒక్క సారి మద్యం దుకాణాల వైపు చూడండి !

అనగనగరా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ పాలకుడు. అక్కడ అతను చెప్పిందే కొనాలి. అతను చెప్పిందే తాగాలి . అంతా అతని దుకాణాలే ఉంటాయి. ఆ దుకాణాల్లో అమ్మేవి తాగి చచ్చిపోతే...

కోవిషీల్డ్ …డేంజరేనా..?

కరోనా విజృంభణ సమయంలో ప్రాణాలు కాపాడుతాయని నమ్మి వేసుకున్న వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వ్యాక్సిన్ లో లోపాలు ఉన్నాయని వ్యాక్సిన్ వేసుకున్న పలువురు చెప్తూ వచ్చినా మొదట్లో కొట్టిపారేసిన బ్రిటన్ ఫార్మా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close