నీరబ్‌కు షాక్..! నెక్ట్స్ సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్..!?

ఆంధ్రప్రదేశ్ తదుపరి చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ దాస్‌ను ముఖ్యమంత్రి జగన్ ఎంపిక చేసుకున్నట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. తర్వాత సీఎస్‌గా ఎవరు ఉంటారనేది.. అంతకు ముందు బదిలీల్లో ముఖ్యమంత్రులు సూచనలు పంపుతారు. చీఫ్ సెక్రటరీ తర్వాత అత్యంత కీలకమైన సీసీఎల్‌ఎ కమిషనర్‌గా.. కాబోయే చీఫ్ సెక్రటరీని నియమిస్తారు. నిన్నటి వరకూ సీసీఎల్‌ఏగా సీనియర్ ఐఏఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నారు. ఆయనే సీఎస్ అవుతారని అనుకున్నారు. అనూహ్యంగా రాత్రికి రాత్రే నీరబ్ కుమార్ ప్రసాద్‌ను బదిలీ చేసేశారు. ఆయన వద్ద ఉన్న అన్ని శాఖల నుంచి రిలీవ్ చేసేశారు. సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయమని ఆదేశించారు. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు.

నీరబ్ కుమార్ ప్రసాద్‌కు సిన్సియర్ అధికారిగా పేరుంది. ఆయనకు వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. ఆయన మొత్తం క్షణ్ణంగా విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. అయితే.. అది ప్రభుత్వ పెద్దలు అప్పటి వరకూ చెబుతూ వస్తున్న.. చేస్తున్న చేతలకు కాస్త భిన్నంగా ఉంది. దీంతో అప్పటి నుండే ఆయనపై అసంతృప్తి ప్రారంభమైందన్న చర్చ అధికారవర్గాల్లో ఉంది. సీఎస్‌గా నీలం సాహ్ని పదవీ కాలం ఎప్పుడో పూర్తయింది. కరోనా కారణంగా రెండు విడుతలగా ఆమెకు పదవీ కాలం పొడిగింపును జగన్ ఇచ్చారు. ఇక నిబంధల ప్రకారం పొడిగింపు లభించకపోవచ్చని చెబుతున్నారు. ఏపీ సర్కార్ నుంచి అలాంటి ప్రతిపాదనేది కేంద్రం వైపు వెళ్లలేదు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆదిత్యనాథ్ దాస్ అత్యంత కీలకమైన శాఖలు నిర్వహించారు. భారీ నీటి పారుదల శాఖలో ఆయన హవా ఉండేది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఆయన పేరు కూడా ఉంది. అయితే ఆయనపై ఉన్న అభియోగాలపై విచారణను హైకోర్టు నిలిపివేసింది. ఈ ఆదేశాలపై సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు దీనిపై ఆదిత్యనాథ్ దాస్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. ఆదిత్యనాథ్ దాస్‌కు అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కున్నందునకోర్టు ఖర్చుల కోసం.. అప్పటి ప్రభుత్వం రూ.7.56 లక్షలు ఇచ్చింది. నిబంధనల ప్రకారంం.. న్యాయవాదుల నుంచి రసీదులు తీసుకుని ప్రభుత్వానికి ఆ లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. కానీ చెప్పలేదు. దీనిపైనా ఆయనపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో నిందితులగా ఉన్న వారికి పెద్ద ఎత్తున పదవులు లభిస్తున్నాయి. అధికారుల్లోనూ వారికే ప్రాధాన్యం లభిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రులకు హైకమాండ్ వార్నింగ్… ఓడితే వేటు తప్పదా..?

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. నియోజకవర్గ ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచనలు, సలహాలు ఇస్తూ ప్రచారంలో దూకుడు పెంచేలా ప్లాన్ చేస్తోంది. అయినా కొంతమంది...

దటీజ్ జగన్ – “ప్రతిభా ప్రదర్శన”లో అసలు తగ్గరు !

జగన్ మోహన్ రెడ్డి అంటే ఓక ఇది.. ఒక అది అని వైసీపీ నేతలు ఎలివేషన్లు ఇస్తూంటారు. కానీ ఎప్పుడు ప్రసంగించినా ఆయన ప్రతిభ ఏమిటో ప్రజల ముందు కనిపిస్తూనే ఉంటుంది. ...

నార్త్ కు మోడీ ప్రాధాన్యత…దక్షిణాదిలో బీజేపీకి ఓట్లు రాలేనా..?

మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తోందని, దక్షిణాది రాష్ట్రాలను విస్మరిస్తోందని విమర్శలున్నాయి. బడ్జెట్ కేటాయింపులు , కేంద్ర మంత్రివర్గ శాఖలు.. ఇలా ఎలా చూసినా నార్త్...

ఓటేస్తున్నారా ? : బోడిగుండుగా మారిన రుషికొండను గుర్తు చేసుకోండి !

చంద్రబాబు హయాంలో ఐదు వందల కోట్లు పెట్టి సచివాలయ భవనాలు, అసెంబ్లీని నిర్మించారు. అవి ట్రాన్సిట్ భవనాలు. ఐకాన్ బిల్డింగ్స్ కట్టడానికి పునాదులు వేసే సరికి జగన్ వచ్చి కూర్చున్నారు. ఈ ఐదేళ్లలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close