బాండ్ల పేరుతో ప్రభుత్వానికి శ్రీవారి నిధులు బదలాయింపు..!

రాష్ట్ర ప్రభుత్వ నిధుల కష్టాలు తీర్చేందుకు టీటీడీ సిద్ధమయింది. శ్రీవారి సొమ్మును బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా చేసే బదులుగా ప్రభుత్వానికే వడ్డీకి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది. మొదట సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ దానికి రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు అని సవరణ చేశారు. అంటే.. ఉద్దేశపూర్వకంగానే… శ్రీవారి నిధులను.. మళ్లించడానికి ఓ ప్లాన్ ప్రకారం ఇలా చేస్తూ వచ్చారని స్పష్టమవుతోంది.

శ్రీవారి ఫిక్స్‌డ్ డిపాజిట్లను బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసి మరీ ప్రభుత్వ బాండ్లను కొనే అవకాశం ఉంది. బ్యాంకుల ద్వారా ప్రస్తుతం 3 నుంచి 4 శాతం మాత్రమే వడ్డీ లభిస్తోందని.. అదే బాండ్ల ద్వారా 7 శాతం లభించే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాండ్లని చెబుతున్నారు కానీ.. టీటీడీ అసలు ఉద్దేశం మాత్రం ఏపీ సర్కార్ కి శ్రీవారి నిధులు మళ్లించడమేనని అంచనా వేయడం సులువే. ఏపీ సర్కార్‌కు ఎక్కడా అప్పు పుట్టడం లేదు. ఆర్బీఐలో తీసుకోవాల్సిన రుణం పరిధి దాటిపోయింది.

ఎక్కడా అవకాశం లేకపోవడంతో.. శ్రీవారి నిధులపై కన్నేసినట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయం మరోసారి టీటీడీపై తీవ్రమైన వివాదం రేగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే శ్రీవారి భూముల అమ్మకంపై రేగిన వివాదంతో.. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న సమయంలో.. ఇలాంటి తీవ్రమైన నిర్ణయాన్ని టీటీడీ లేదా.. ప్రభుత్వం తీసుకుంటుందా.. అన్న చర్చ కూడా జరుగుతోంది. టీటీడీ ఇలాంటి నిర్ణయం తీసుకోబోతోందని.. గత నెల పదిహేడో తేదీనే తెలుగు 360 వెల్లడించింది.

https://www.telugu360.com/te/ttd-funds-to-turn-into-ap-govt-bonds/

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close