ఏపీ సర్కార్ బాండ్లలోకి శ్రీవారి నిధులు..!

తిరుమల శ్రీవారి సొమ్ము ఇక ప్రభుత్వంలోకి ప్రవహించబోతోంది. బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసి మరీ ప్రభుత్వ బాండ్లను కొనాలనే ఆలోచనను టీటీడీ బోర్డు చేస్తోంది. దీనికి కారణం బ్యాంకుల్లో వడ్డీ తక్కువగా వస్తోందట… ప్రభుత్వ బాండ్లలో అయితే.. ఎక్కువగా వడ్డీ వస్తుందట. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ తగ్గుముఖం పట్టడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లుగా టీటీడీ వర్గాలు మీడియాకు చెబుతున్నాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల బాండ్లను కొనుగోలు చేసే యోచనలో ఉన్నామని చెబుతున్నారు. బ్యాంకుల ద్వారా ప్రస్తుతం 3 నుంచి 4 శాతం మాత్రమే వడ్డీ లభిస్తోందని.. అదే బాండ్ల ద్వారా 7 శాతం లభించే అవకాశం ఉందని టీటీడీ ఆర్థిక మేధావులు అంచనా వేస్తున్నారు. ఆ దిశగా డిఫాజిట్లు చేయాలని టీటీడీ భావిస్తోంది. రాబోయే పాలకమండలి సమావేశంలో బాండ్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

చెప్పడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాండ్లని చెబుతున్నారు కానీ.. టీటీడీ అసలు ఉద్దేశం మాత్రం… ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీ సర్కార్ కి శ్రీవారి నిధులు మళ్లించడమేనన్న విశ్లేషణలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఏపీ సర్కార్‌కు ఎక్కడా అప్పు పుట్టడం లేదు. ఆర్బీఐలో తీసుకోవాల్సిన రుణం పరిధి దాటిపోయింది. బ్యాంకులు కూడా.. ఏపీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ తీరు చూసి.. విస్తుపోతున్నాయి. రుణాలిస్తే గోడకు కొట్టిన సున్నం అవతుందేమో అన్న ఉద్దేశంతో రుణ ప్రతిపాదనల పరిశీలన కూడా చేయడం లేదు. ఇప్పుడు… ఆదాయానికి నాలుగైదు రెట్ల ఖర్చును పెట్టుకుంటూ పోతున్న ఏపీ ప్రభుత్వానికి దిక్కుతోచని స్థితి ఏర్పడింది. అందుకే.. శ్రీవారి నిధులు బాగా ఉపయోగపడతాయని అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు.

శ్రీవారి నిధులను జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేస్తూంటారు. ఇప్పుడు..వాటిని ఉపసంహరించి.., ఏపీ సర్కార్ బాండ్లలో ఎక్కువ వడ్డీకి పెట్టుబడి పెట్టే దిశగా ఆలోచన చేస్తున్నారని సులువుగానే అర్థమవుతోంది. అదే జరిగితే.. మరోసారి టీటీడీపై తీవ్రమైన వివాదం రేగడం ఖాయమని భావించవచ్చు. ఇప్పిటికే శ్రీవారి భూముల అమ్మకంపై రేగిన వివాదంతో.. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న సమయంలో.. ఇలాంటి తీవ్రమైన నిర్ణయాన్ని టీటీడీ లేదా.. ప్రభుత్వం తీసుకుంటుందా..అన్న చర్చ కూడా జరుగుతోంది. వచ్చే టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ అంశం కీలకం కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close