తెలంగాణ సీబీఐ కోర్టుల్లో దేశంలోనే అత్యంత భారీ అవినీతి “కేసు”..!

అత్యంత తీవ్రమైన నేరాలు చేసిన వారు ప్రజా జీవితంలో కొనసాగుతూ… నేరపూరిత ఆలోచనలతో వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారన్న ఆందోళన దేశవ్యాప్తంగా పెరిగిపోతోంది. అందుకే.. ఇలాంటి నేరాభియోగాలు ఉన్న ప్రజాప్రతినిధులపై ఏడాదిలోపు విచారణ పూర్తి చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. దానిపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. నిజానికి 2014 ఎన్నికల ప్రచార సమయంలోనే.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా.. అవినీతి నేతలపై విచారణ చేస్తామని ప్రకటించారు. కానీ ఇంత వరకూ అది అమల్లోకి రాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. కేంద్రం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడానికి సిద్ధమయింది. ఏడాదిలో విచారణ పూర్తయ్యేలా కోర్టులను ఏర్పాటు చేయబోతోంది.

ఈ మేరకు సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ అన్ని కోర్టుల్లో ప్రజాప్రతినిధులపై ఉన్న తీవ్రమైన నేరాభియోగాల జాబితాలను తెప్పించుకుంది. అమికస్ క్యూరీ ఈ సమాచారాన్ని సుప్రీంకోర్టుకు సమర్పించారు. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి కోర్టులో ప్రజాప్రతినిధులపై 23 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ వివరాలను సుప్రీంకోర్టు నియమించిన అమికస్‌ క్యూరీ సమర్పించిన నివేదికలో వెల్లడించారు. పలు కేసులు 2012-13 నుంచి అపరిష్కృతంగా ఉన్నాయని, ఆరు కేసులపై హైకోర్టు స్టే విధించిందన్నారు. వీటిలో నాలుగు కేసులు డిశ్చార్జి పిటిషన్‌పై విచారణ దశలో ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టు ఎదుట 10 జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన 118 కేసులు ఉన్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టుల నుంచి వచ్చిన వివరాల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్‌ నేరాలు కాకుండా 175 అవినీతి నిరోధక చట్టం కేసులు, 14 మనీలాండరింగ్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

దేశంలోనే అత్యంత అవినీతి పరమైన కేసు కూడా హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఉంది. ఓ ప్రజాప్రతినిధిపై ఇంత భారీ అవినీతి కేసు దేశంలో మరో చోట లేదు. సుప్రీంకోర్టు పట్టుదలగా… ప్రక్షాళన ప్రారంభిస్తే… సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులపై కేసులు ఉన్నాయి. అవి కూడా ఏడాదిలో తేలిపోతే రాజకీయంగా సంచలనాలు ఖాయమని భావించవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close