కరోనాతో తిరుపతి ఎంపీ మృతి

తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు కరోనా సోకి మరణించారు. ఆయన పదిహేను రోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు కరోనా సోకినట్లుగా బయటకు తెలియలేదు. పరిస్థితి రోజు రోజుకు విషమించడంతో… పదిహేనురోజుల చికిత్స తర్వాత ఆయన కన్నుమూశారు. గత ఎన్నికల ముందు వరకు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. గత ఎన్నికల్లో ఎక్కడా టీడీపీ నుంచి టిక్కెట్ లభించకపోవడంతో… వైసీపీలో చేరారు. తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో తిరుపతి టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు.

చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన బల్లి దుర్గాప్రసాద్ అంచెలంచెలుగా ఎదిగారు. 1985లో రాజకీయాల్లోకి వచ్చి.. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా గూడూరు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మృతి చెందిన తొలి ప్రజాప్రతినిధి బల్లి దుర్గాప్రసాదరావు.

తెలంగాణలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోయారు. అయితే ఆయనకు కరోనా నిర్ధారణ కాలేదు. వారి కుటుంబసభ్యులందరికీ వచ్చింది. మాజీ మంత్రి మాణిక్యాలరావు కూడా కరోనా కారణంగా చనిపోయారు. అయితే ఆయన మాజీ ప్రజాప్రతినిధిగా ఉన్నారు. డెడ్లీ వైరస్ దెబ్బకు…దేశవ్యాప్తంగా చనిపోయిన రెండో ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు. తమిళనాడులో కాంగ్రెస్ ఎంపీ ఒకరు కరోనాతో చనిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close