ఐపీఎల్‌లో చేజింగ్ సండే..!

ఐపీఎల్‌లో ప్రతీ ఆదివారం రోమాలు నిక్కబొడుచుకునే మ్యాచ్‌లు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఆదివారం మాత్రం సాదాసీదా మ్యాచ్‌లో జరిగాయి. అయితే రెండు మ్యాచ్‌ల్లోనూ చేజింగ్ టీమ్‌లో విజయ సాధించాయి. స్కోర్ ఎంత అనే చూడకుండా… బ్యాట్స్‌మెన్లు ఎడాపెడా బాదేశారు. తమ జట్లకు విజయాలను అందించారు. ఈ క్రమంలో అలవోకగా సిక్సర్లు బాదేశారు. సెంచరీలు కొట్టేశారు.

తిరుగులేని విధంగా ఆడుతున్న ముంబైకు.. రాజస్థాన్ షాక్ ఇచ్చింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ముంబై మొదట బ్యాటింగ్ చేసి 196 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ముందు ఉంచింది. ఇక గెలుపే తరువాయని రిలాక్సయిపోయింది. కానీ… అక్కడ బెన్ స్టోక్స్ సీన్ మార్చేశాడు. క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుండి బాదుడే బాదుడు.. అరవై బంతుల్లోనే 107 పరుగులు చేసి గెలిచేదాకా ఔట్ కాకుండా నిలిచాడు. స్టోక్స్‌కు శాంసన్ తోడయ్యాడు. దీంతో.. 196 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ మరో పది బంతులు మిగిలి ఉండగానే సాధించేసింది. ముంబై 195 పరుగుల భారీ స్కోర్ చేయడంలో హార్దిక్‌ పాండ్యది కీలక పాత్ర. 21 బంతుల్లోనే అరవై పరుగులు చేశాడు.

అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లోనూ చేజింగ్ టీమ్‌నే విజయం వరించింది. బెంగళూరు జట్ట విధించిన 146 పరుగుల లక్ష్యాన్ని తడబడకుండానే చేధించారు. గత మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్ పేకమేడలా కుప్పకూలింది. దీంతో .. స్వల్ప లక్ష్యమైనా .. చెన్నై గెలుస్తుందా.. లేదా అన్న ఆందోళన అభిమానుల్లో ఏర్పడింది. అయితే.. రుతురాజ్‌ గైక్వాడ్‌, అంబటి రాయుడు గట్టిగా నిలబడటంతో విజయం సాకారమైంది. మంచి ఫామ్‌లో ఉన్న బెంగళూరు.. మొదట బ్యాటిం‌గ్ ఎంచుకుని పరుగులు చేయడంలో ఇబ్బంది పడింది. విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ ఆచితూచి ఆడారు. 15 ఓవర్ల తర్వతా ఆ జట్టు స్కోరు 101 మాత్రమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close