అమరావతి రైతులపై ఎన్నెన్ని కేసులో..!?

అమరావతి రైతులు కాలు కదిపితే కేసు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం.. కొంత మంది దళిత రైతులపై కేసులు నమోదు చేశారు. ఆ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా.. ఫిర్యాదు ఉపసంహరించుకున్నట్లుగా లేఖ ఇచ్చారు. అయినప్పటికీ.. పోలీసులు రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఇప్పుడీ వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. భూములిచ్చి రోడ్డున పడి వారు చేసుకుంటున్న ఉద్యమానికి పెయిడ్ ఉద్యమం అని ప్రభుత్వ పెద్దలు విమర్శలు చేస్తున్నా… సహిస్తూ… వారి ఉద్యమం వారు చేసుకుంటున్నారు. అయితే వారికి పోటీగా… స్పాన్సర్డ్ మూడు రాజధానుల ఉద్యమాన్ని ఇటీవల ప్రారంభించారు. ఇతర ప్రాంతాల నుంచి రాజధాని గ్రామాల్లోకి మనుషుల్ని తీసుకు వచ్చి.. పోటీ ధర్నాలు చేయిస్తున్నారు.

ఇలా రైతుల్ని తీసుకు వస్తున్న ఆటోలను కొంత మంది దళిత రైతులు రాజధాని గ్రామాల్లో అడ్డుకున్నారు. ఎందుకొస్తున్నారని ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించడమే నేరం అయినట్లుగా.. రైతులపై ఓ వ్యక్తితో ఫిర్యాదు చేయించారు. తర్వాత ఫిర్యాదు చేసిన వ్యక్తి ఉపసంహరించుకున్నారు. కానీ పోలీసులు మాత్రం ఫిర్యాదును మాత్రమే తీసుకున్నారు. ఉపసంహరణను పట్టించుకోలేదు. దళిత రైతులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. దీనిపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.

అయితే పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. ఆ రైతుల్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి రాజధానిలో పెయిడ్ ఉద్యమం రోజువారీ పద్దతిలో సాగుతోంది. అసలైన రైతుల ఉద్యమాన్ని బలహీనం చేసేందుకు వైసీపీ నేతలు చాలా చాలా కష్టాలు పడుతున్నారు. అందులో భాగంగా కేసులు నమోదు చేసి.. అరెస్ట్ చేసి జైలుకు పంపడానికి కూడా వెనుకాడటం లేదు . భూములిచ్చిన రైతులు.. ఎన్ని విధాలుగా ఇబ్బంది పడాలో.. అన్ని విధాలుగా కష్టాలు పడుతున్నారు. అన్నింటికీ కారణం ప్రభుత్వమే. రాష్ట్ర రాజధానికి భూములివ్వడమే వారు చేసిన పాపం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close