సుజనాకు “లుకౌట్” భయం..!

భారతీయ జనతా పార్టీలో చేరి.. బ్యాంకులకు లోన్లు ఎగ్గొట్టిన కేసుల నుంచి విచారణ వేధింపుల గండం గట్టెక్కిన ఎంపీ సుజనా చౌదరికి కొత్త కష్టాలొచ్చాయి. గతంలో బ్యాంకుల ఫిర్యాదు మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు జారీ చేసిన లుకౌట్ నోటీసులు అమల్లో ఉన్నాయని.. తనను అమెరికా వెళ్లకుండా అడ్డుకుంటారని ఆయన ఆందోళన చెందారు. తనను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. లుకౌట్ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ మేరకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయన అమెరికా పయనమవుతున్నారు.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత వరకూ సుజనా చౌదరి టీడీపీలో ఉన్నారు. అప్పట్లో ఆయనపై పలు రకాల బ్యాంక్ ఫ్రాడ్ కేసులు ఉన్నాయి. చెన్నై, బెంగళూరుల్లో ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఆయనను ప్రశ్నించాయి. ఎన్నికల తర్వాత టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆయన బీజేపీలో చేరారు.ఆ తర్వాత ఆయా దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు రావడం కానీ.. విచారణకు పిలిచినట్లుగా కానీ ఎక్కడా సమాచారం బయటకు రాలేదు. తాజాగా తనను అమెరికా వెళ్లకుండా అడ్డుకుంటారనే అనుమానంతో స్వయంగా కోర్టులో పిటిషన్ వేయడంతోనే విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ లుకౌట్ నోటీసులు గతంలోనే జారీ చేసినట్లుగా భావిస్తున్నారు. వాటిని క్యాన్సిల్ చేయించుకోవడంలో విఫలం కావడంతో.. హైకోర్టు నుంచి ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. సాధారణంగా లుకౌట్ నోటీసులు ఉంటే… దేశం నుంచి బయటకు వెళ్లేందుకు అంగీకరించరు. అదుపులోకి తీసుకుని సంబధిత దర్యాప్తు సంస్థలకు అప్పగించడమో.. వెనక్కి పంపడమో చేస్తారు. ఇలా జరిగితే మరింత వివాదాస్పదం అవుతుంది. అందుకే సుజనా ముందు జాగ్రత్త పడినట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close