ఈ సారి రైతుబంధుకు రూ. 7300 కోట్లు..!

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి.. వీలైనంత త్వరగా బయటపడాలంటే.. సంక్షేమ పథకాలను మరింత పకడ్బందీగా ఆమలు చేయాలన్న ఆలోచనకు వచ్చారు. ముఖ్యంగా తనకు ఇంతకు ముందు ఘన విజయాలు సాధించి పెట్టిన రైతు బంధు పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సారి ఎప్పుడూ లేని విధంగా రైతు బంధు పథకం కోసం రూ. 7300 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ ఇరవై ఏడో తేదీ నుంచి వచ్చే ఏడో తేదీ వరకూ… రైతులందరికీ.. పథకం నిధులు జమ చేయాలని ఆదేసించారు. ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ.. నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులను జమ చేయాలనిన్న కేసీఆర్‌ స్పష్టం చేశారు.

తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి.. ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతులందరికీ 10 రోజుల్లో డబ్బులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకున్న తర్వాత కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. 2018 మొదట్లో తొలి విడత పంపిణీ చేశారు. రెండో విడత పంపిణీ చేసే సమయానికి ముందస్తు ఎన్నికలు పెట్టారు. ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్నప్పటికీ.. నిధుల పంపిణీకి ఆటంకం లేకుండా పోయింది. ఈ నిధులు కేసీఆర్ విజయానికి కారణం అయ్యాయన్న చర్చ జరిగింది. అయితే ఆ తర్వాత పథకం పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు.

2019లో మొదటి విడత రైతు బంధు నిధులు సగం మంది వరకూ జమ కాలేదు. రెండో విడత రైతు బంధు నిధుల విషయంపై కూడా అంతే అసంతృప్తి ఉంది. అయితే.. ఈ సారి మాత్రం అలాంటి పరిస్థితులు రాకూడదని.. కేసీఆర్ నిర్ణయించారు. మామూలుగా అయితే.. ఈ పాటికి రైతు బంధు నిధులు పంపిణీ చేయాల్సి ఉంది. అక్టోబర్-నవంబర్‌లోనే పంపిణీ చేస్తారు. ఈ సారి ఆలస్యంగా విడుదల చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close