ఖాతా క్లియర్ : పోలవరం బిల్లులు ఇక ఆ ప్రాజెక్టుకే..!

కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి విడుదల చేసే నిధులు ఆ ప్రాజెక్టుకు మాత్రమే ఖర్చు చేయాలని ఇతర వాటికి మళ్లించడానికి అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చేసింది. గత ఏడాది ఇలా విడుదల చేసిన నిధులు.. దాదాపు రూ. మూడు వేల కోట్ల నిధులు ప్రభుత్వం ఇతర వాటికి ఖర్చు చేసేయడంతో ఈ సారి కేంద్రం రూటు మార్చింది. ప్రత్యేకంగా ఖాతా ఏర్పాటుచేసి.. ఇప్పుడు విడుదల చేయాల్సి ఉన్న రూ. 2200 కోట్లను విడుదల చేయబోతోంది. పోలవరం ప్రాజెక్టుకు తప్ప.. మరో అవసరానికి ఆ నిధులు ఖర్చు చేయడానికి లేదు. ప్రస్తుతం ఆ ఖాతా నిర్వహణ విధి విధానాల ఖరారులో పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ ఉంది.

పోలవరం ప్రాజెక్టుకు మొదట ప్రభుత్వం ఖర్చు పెడితే.. తర్వాత కేంద్రం రీఎంబర్స్ చేస్తుంది. ఆ ప్రకారం గత టీడీపీ ప్రభుత్వం శరవేగంగా ప్రాజెక్టును నిర్మించి.. వేల కోట్లతో పనులు చేయించింది. అలా ప్రభుత్వం దిగిపోయే సరికి.. ఆరు వేల కోట్ల వరకూ బిల్లులు రావాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఒక విడత మంజూరు చేశారు. వాటిని ఇతర అవసరాలకు ప్రభుత్వం వాడుకుంది. దానికి కారణం కూడా ప్రభుత్వం చెప్పింది. ఆ నిధులను ఇప్పటికే పోలవరంలో ఖర్చు చేసేశారనేదే ఆ కారణం. ఇప్పుడు మరో విడత నిధులు విడుదల కావాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 200 కోట్ల పనులు కూడా జరగలేదని.. రికార్డులు చెబుతున్నాయి. ఈ క్రమంలో కొత్తగా వచ్చే నిధులు కూడా ప్రభుత్వం ఇతర వాటికి ఖర్చు చేస్తే.. ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోతుందని కేంద్రం ఆందోళన చెందినట్లుగా తెలుస్తోంది.

ఎప్పుడో విడుదల కావాల్సిన నిధులు ఇంత వరకూ విడుదల కాలేదు. అదే పనిగా.. మంత్రి బుగ్గన రాజేంద్రనాత్ రెడ్డి ఢిల్లీకి తిరిగినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ప్రత్యేక ఖాతా ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొత్త అంచనాలు అంగీకరిస్తేనే ఈ రెండు వేల కోట్లు ఇస్తామని గత పీపీఏ మీటింగ్‌లో కేంద్రం చెప్పింది. చివరికి.. ఈ సారికి ఇస్తామని..మరోసారి నిధులు విడుదల చేయాలంటే.. తగ్గించిన అంచనాలు అంగీకరించాల్సిందేనని స్పష్టం చేసింది., ఈ నిధులు వస్తే చాలనుకుందేమో కానీ ప్రభుత్వం సైలెంట్‌గా ఉంది. కానీ ఆ నిధులు విడుదల కాలేదు. ఇప్పుడు.. ఇంకా ఆలస్యం అవుతోదంది. ఒక వేళ వచ్చినా… ప్రాజెక్టుకే ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెగా ఫ్యామిలీలో రచ్చ…అల్లు అర్జున్ పై నాగబాబు సీరియస్..!?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడంపై ఇంకా తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆయన పర్యటన...

వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు ఇది అవ‌స‌ర‌మా అధ్య‌క్షా..?!

ఏ ఆటైనా మైదానంలో జ‌ట్టు స‌భ్యులంతా స‌మ‌ష్టిగా ఆడితేనే అందం, విజ‌యం. ఒక‌రిపై మ‌రొక‌రు క‌స్సుబుస్సులాడుతుంటే, క‌య్యానికి కాలుదువ్వుతుంటే, అస‌లు జ‌ట్టు స‌భ్యుల మ‌ధ్య స‌యోధ్య లేక‌పోతే - ప్ర‌త్య‌ర్థుల‌పై ఎలా త‌ల‌ప‌డ‌తారు?...

విజ‌య్ స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి?

టాలీవుడ్ లో ఓ కొత్త కాంబోకి తెర లేవ‌నుందా? విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సాయి ప‌ల్ల‌వి క‌లిసి న‌టించ‌బోతున్నారా? ఆ అవ‌కాశాలు ఉన్నట్టే క‌నిపిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా దిల్ రాజు బ్యాన‌ర్‌లో...

విశ్వసనీయత కోల్పోతున్న కేసీఆర్…?

అనేక ఆటుపోట్లను ఎదుర్కొని రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణలో బీఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా నిలిపిన కేసీఆర్ ప్రస్తుతం రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోతున్నారా..?ఇందుకు కారణం ఆయన వరుసగా చేస్తోన్న వ్యాఖ్యలేనా..? అంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close