కేసీఆర్ ఎక్కడ..? బీజేపీ నినాదం ఇక ఇదే..!?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కువగా బయటకు రారు. ఆయన ఫామ్‌హౌస్‌లోనో.. ప్రగతి భవన్‌లోనో ఉంటారు. తనకు అత్యంత ముఖ్యం అయిన కార్యక్రమాల్లోనే పాల్గొంటారు. భారతీయ జనతా పార్టీ నేతలు… ఈ అంశాన్ని మెల్లగా చర్చనీయాంశం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఉన్నారు. పీవీ నరసింహారావు వర్థంతి కార్యక్రమాల్లో కూడా కేసీఆర్ పాల్గొనకపోవడంతో.. ఈ అంశంపైనే ఘాటుగా విమర్శలు చేయడం ప్రారంభించారు. గ్రేటర్ ఎన్నికల కోసమే పీవీ జయంతి పేరుతో హడావుడి చేశారని.. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి బయటకు రావడం లేదని..కేసీఆర్ ఎక్కడ ఉన్నారో.. ఎక్కడ పన్నారో తెలియట్లేదని సంజయ్‌ విమర్శించడం ప్రారంభించారు.

గ్రేటర్ ఎన్నికల్లోనూ బీజేపీ.. కేసీఆర్ బయటకు రాకపోవడాన్ని చర్చనీయాంశం చేసింది. హైదరాబాద్‌కు వరదలు వచ్చి కొట్టుకుపోయినప్పుడు కనీసం కేసీఆర్ పలకరింపులకు రాలేదని కానీ.. ఎన్నికలు రాగానే ఓట్లు కోసం వస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఆయన ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రి అని అనడం ప్రారంభించారు. అయితే కేసీఆర్ ఇలాంటి వాటిని పట్టించుకోరు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. భారతీయ జనతా పార్టీ నేతలు.. పని చేయని సీఎం అనే ముద్ర వేయడానికి పకడ్బందీ ప్రణాళికలు వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

కేసీఆర్ నాలుగు రోజుల క్రితం… కేంద్ర మంత్రి గడ్కరీతో జరిగిన ఓ ఆన్ లైన్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. కానీ కేసీఆర్ పాల్గొనలేదు. యథాలాపంగా అన్నారో.. నిజమో కానీ… మంత్రి ప్రశాంత్ రెడ్డి.. కేసీఆర్ అస్వస్థతగా ఉన్నారని.. అందుకే పాల్గొనలేదని వివరణ ఇచ్చారు. వెంటనే గడ్కరీ..అయితే కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీంతో కేసీఆర్‌కు ఏమయింది అని.. సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే కేసీఆర్ అనారోగ్య కారణం కేవలం.. ఆ కార్యక్రమాన్ని స్కిప్ చేయడానికేనని కొంత మంది టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. గతంలోనూ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇలాంటి కారణం చెప్పడంతో .. అందరూ లైట్ తీసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close