జగనన్న ఇల్లు రూ. లక్షా ఎనభై వేలు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఇల్లు లేని వారు ఉండకూడదన్న లక్ష్యంతో ఉన్న ఏపీ సర్కార్ 30 లక్షల ఇళ్లను నిర్మిస్తోంది. క్రిస్మస్ రోజున ఇళ్ల మంజూరు పత్రాలు కూడా మంజూరు చేశారు. పంపిణీ చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణం కూడా నిన్నటి రోజునే ప్రారంభిస్తామని ప్రకటనలు చేసింది కానీ ఎక్కడా ప్రారంభించిన దాఖలాలు లేవు. కానీ ప్రభుత్వం .. లబ్దిదారులకు ఓ ఆఫర్ ఇచ్చింది. మూడు ఆప్షన్స్ ఇచ్చి… ఎంచుకోమని కోరింది. అందులో మొదటి రెండు లబ్దిదారులకు డబ్బులు ఇస్తే కట్టుకునేలా.. మూడోది ప్రభుత్వమే నిర్మించుకునేలా ఆప్షన్ ఉంది. మొదటి రెండు ఆప్షన్లలో ప్రభుత్వం ఇచ్చే మొత్తం సొమ్ము రూ. లక్షా ఎనభై వేల రూపాయలు మాత్రమే.

వాటితో బెడ్ రూం, కిచెన్, హాల్, వరండా ఉన్న శ్లాబ్ ఇల్లు ఇలా వస్తుందనేది చాలా మందికి మిస్టరీగా మారింది. కానీ ప్రభుత్వం మాత్రం… మోడల్ హౌస్ కట్టి చూపించింది. ప్రదర్శనకు పెట్టింది. దానికి రూ. లక్షా ఎనభై వేలు మాత్రమే ఖర్చు అయిందని ప్రభుత్వం చెబుతోంది. అందుకే.. అంత మాత్రమే లబ్దిదారులకు ఇస్తామంటోంది. అయితే వాస్తవంగా.. ఒక్క ఇల్లు కట్టుకోవాలంటే… అదీ కూడా ప్రభుత్వం చెప్పిన ప్రమాణాల్లో కట్టుకోవాలంటే ఎడెనిమిది లక్షలు అవుతుందనేది నిర్మాణ రంగంలో ఉన్న వారు చెప్పే మాట. 340 చదరపు అడుగుల ఇల్లు కట్డడానికి తాపీ మేస్త్రీలే … 70వేలు వసూలు చేస్తారని.. ఇక సెంట్రింగ్ సహా ఇతర పనులన్నింటికీ ఎక్స్‌ట్రా అవుతాయని గుర్తు చేస్తున్నారు.

ఇక మెటీరియల్ సంగతి చెప్పాల్సిన పని లేదు. గత మూడు నెలల కాలంలో ఇరవై శాతం వరకూ పెరిగాయి. ప్రభుత్వం.. డబ్బులు ఇస్తే.. లబ్దిదారులు సగం కట్టుకుని పూర్తి చేసే దారి లేక… ఆపేస్తారు. అదే ప్రభుత్వమే నిర్మిస్తే సమస్య లేకుండా ఉంటుందంటున్నారు. లబ్దిదారులకు డబ్బులిస్తామని చెప్పడం కన్నా.. ప్రభుత్వం నిర్మిస్తేనే… జగన్ చెప్పినట్లు ఇళ్లు మాత్రమే కాదు ఊళ్లను కూడా శరవేగంగా నిర్మించడానికి అవకాశం ఉంటుందన్న చర్చ నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close