రాజాసింగ్ దెబ్బకు శ్రీశైలంలో అంతా సర్దేశారు..!

తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ … శ్రీశైలం రాకుండా చేసిన పోరాటంతో అక్కడ వైసీపీ నేతలు మొత్తం సర్దేసుకున్నారు. అన్య మతస్తులను ఉద్యోగాల నుంచి తప్పించారు. అన్యమతస్తు ల వ్యాపారాలను ఖాళీ చేయించారు. వారం రోజుల క్రితం.. ఎనిమిది మంది ముస్లిం ఉద్యోగులను… తప్పించారు. వారంతా ఆలయంలో తిష్ట వేశారు. వారంతాచాలా కాలంగా కీలక విధుల్లో ఉన్నారు. శుక్రవారం.. అన్యమతస్తుల షాపులను సీజ్ చేశారు. అగ్రిమెంట్ కాలపరిమితి ముగియడంతో 13 ముస్లింల షాపులు సీజ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. వీరంతా గతంలో హైకోర్టును ఆశ్రయించారు. కానీ వారి పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది.

కొద్ది రోజుల కిందట.. శ్రీశైలం ఆలయంలో పెత్తనం అంతా ముస్లింలదేనని రాజాసింగ్ మండిపడ్డారు . వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డినే మొత్తం ముస్లింల చేతుల్లో పెట్టారని.. అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు… వ్యాపారులు… కాంట్రాక్టర్ల జాబితాను బయట పెట్టారు. గతంలో ఓ సారి దుకాణాల వేలం జరుగుతున్న సమయంలోఆయన చలో శ్రీశైలం కార్యక్రమం పెట్టుకున్నారు. కానీ దుకాణాల వేలాన్ని హైకోర్టు నిలిపివేసింది. రాజాసింగ్‌ను శ్రీశైలం రాకుండా అడ్డుకున్నారు. అప్పటితో ఆ వివాదం ముగిసింది. తాజాగా..రాజాసింగ్ శ్రీశైలంపై గురి పెట్టారు.

రాజాసింగ్ ఆరోపణల్ని సీరియస్‌గా తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి సవాళ్ల మీద సవాళ్లు చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా చాలెంజ్ చేశారు. అయితే తర్వాత ఒక్కొక్కటిగా… శ్రీశైలంలో సర్దడం ప్రారంభించారు. ముందుగా ఉద్యోగుల్ని తొలగించారు. ఆ తర్వాత దుకాణాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటికే ఆలయంలో అనేక పనుల కాంట్రాక్టులు ముస్లింలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశాన్ని ఇంతటితో వదిలి పెట్టబోమని అంటున్నారు. మొత్తంగా ఇరుక్కుపోయిన శిల్పా చక్రపాణి రెడ్డి… తప్పు జరగలేదని వాదించడం ప్రారంభించారు. తప్పు జరగకపోతే.. ఇన్ని సర్దుళ్లు ఎందుకు చేశారన్నది బీజేపీ నేతల వాదన.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close