స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో డిసైడ్ చేసిన విజయసాయి..!

స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సింది స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ఎప్పుడు నిర్వహించాలి.. ఏ తేదీల్లో పెట్టాలి.. అనేది ఆయన విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. కానీ… ఏపీలో వైసీపీ నేతలు… ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అనధికారికంగా తీసుకున్న వారు ఎప్పుడు నిర్వహిస్తామో… చెప్పేస్తున్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల గురించి… ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబితే.. ఇంతెత్తున లేచిన వైసీపీ నేతలు… ఇప్పుడు… ఏప్రిల్‌, మేలో నిర్వహిస్తామని ప్రకటిస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి… ఈ మేరకు ప్రకటన చేశారు. స్థానిక ఎన్నికలు… ఏప్రిల్, మేలో జరుగుతాయని తమ పార్టీ విశ్వసిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. చేసేది.. చేయించేది ఆయన పార్టీనే కాబట్టి.. ఆ విశ్వాసమే నిజం అని అనుకోవాలని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం.. మార్చితో ముగుస్తుంది. అప్పటి వరకూ ప్రభుత్వానికి కరోనా సెకండ్ వేవ్.. కరోనా స్ట్రెయిన్ లాంటి సమస్యలు పెద్దగా ఉంటాయి. ఆయన రిటైరైన తర్వాత.. కనగరాజునో మరొకర్నో నియమించుకున్న తర్వాత పరిస్థితులు అన్నీ సానుకూలంగా కనిపిస్తాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కరోనా పూర్తిగా అంతమైపోతుంది ఏకగ్రీవాలతో ఎన్నికలను పూర్తి స్థాయిలో ఏకపక్షంగా నిర్వహించుకునే అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అందుకే.. విజయసాయిరెడ్డి ముందస్తుగానే స్థానిక ఎన్నికల గురించి.. చెబుతున్నారు.

తిరుపతి ఉపఎన్నిక మార్చిలోపు జరగాల్సి ఉంది. అది కూడా పూర్తయిన తర్వాత వైసీపీ… స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల బాధ్యత తనపైనే ఉన్నట్లుగా విజయసాయిరెడ్డి చెప్పకనే … ఎప్పుడు జరుగుతాయో ప్రకటించడం ద్వారా చెప్పుకున్నారని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close