ఏపీ ఉద్యోగ సంఘ నేతల పర్‌ఫార్మెన్స్ అదుర్స్..!

కరోనా కారణంగా ఎన్నికల విధులు నిర్వహించలేమని ఉద్యోగ సంఘాలన్నీతెర మీదకు వచ్చాయి. కొన్ని సంఘాలు… ఎస్‌ఈసీని దూషిస్తే.. మరికొన్ని సంఘాలు.. చేతులెత్తి వేడుకున్నాయి. ఈ సంఘాల నేతలందరూ… తలా ఒక రసాన్ని పండించారు. నవరసాల్ని మేళవించి.. తమ తమ వాదనలు వినిపించారు. ఏపీ ఎన్జీవో, ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీవో అమరావతి జేఏసీ, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల సంఘం, రెవెన్యూ, పోలీస్, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల సంఘాలు అన్నీ మీడియా ముందుకు వచ్చి చేసిన ప్రకటలు.. ప్రజల్ని ఔరా అనిపించాయి.

ఏపీలో ఎన్నడూలేని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తాజాగా ఉద్యోగ సంఘాలు తెరపైకొచ్చాయి. ఉద్యోగ సంఘాలు పోటీలుపడి మరీ మీడియా సమావేశాలు ఏర్పాటు చేశాయి. తాము ఎన్నికలు బహిష్కరిస్తామని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ప్రకటించింది. ఏకపక్షంగా ఎన్నికలకు వెళ్తామంటే ఉద్యోగులు సహకరించరని కూడా.. ఈ సంఘాలకు అత్యధికంగా నాయకత్వం వహిస్తున్న రెడ్డి నేతలు చెప్పుకొచ్చారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాట్లాడాల్సిన ఉద్యోగ సంఘాలు… విధులు నిర్వహించలేమని చెప్పడానికి ప్రెస్‌మీట్లు పెట్టడం.. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిఅయిన ఎన్నికలను కూడా బహిష్కరిస్తామని చెప్పడం.. ఇప్పుడు కొత్త వివాదానికి దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది.

ఉద్యోగ సంఘాల నేతల వెనుక ఎవరున్నారో అందరికీ క్లారిటీ ఉంది కానీ.. వారు చెబితే… వీరు ఇలా ప్రకటనలు చేసేస్తారా.. అన్నదే ప్రజల్లోనూ చర్చనీయాంశం అవుతోంది. కరోనాతో బాధపడిన వారిలో అన్ని వర్గాల వారు ఉన్నారు. సాధారణ ప్రజలూ చనిపోయారు. ఇప్పుడు ఏపీలో కరోనాపై ఎలాంటి ఆంక్షలు లేవు. అయినా… ఎన్నికల నిర్వహణపై మాత్రం ఉద్యోగులు తిరగబడుతున్నారు. అదే… నిమ్మగడ్డ వైదొలగగానే.. కొత్తగా వచ్చే అధికారి నేతృత్వంలో అయితే కరోనా ఉండదు.. ఏమీ ఉండదు.. ప్రభుత్వం చెప్పినట్లుగా పని చేస్తారు. ఉద్యోగ సంఘాల తీరు… ప్రజల్ని విస్మయానికి గురి చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రంగంలోకి కేజ్రీవాల్… బీజేపీ ఆశలపై నీళ్లు చల్లుతారా..?

మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇటీవల మధ్యంతర బెయిల్ రావడంతో ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంతమేర ఉంటుందనేది చర్చనీయాంశం అవుతోంది. గతంలో ఢిల్లీలోని లోక్ సభ...

టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు....

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...
video

టీజర్ రివ్యూ : ఇస్మార్ట్ డబుల్ మాస్

https://youtu.be/tq2HmozH_5Y?si=7YJ-IcGKWvYsaRDj రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'తో అలరించబోతున్నారు. రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు. ల్యాబ్‌లో ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close