ప‌వ‌న్ – క్రిష్ సినిమా… ఈ యేడాది లేన‌ట్టే!

ప‌వ‌న్ క‌ల్యాణ్ – క్రిష్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఏఎం ర‌త్నం నిర్మాత‌. `విరూపాక్ష‌` అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఇటీవ‌లే హైద‌రాబాద్ లో షూటింగ్ ని పునః ప్రారంభించారు. ఈరోజు నుంచి షూటింగ్ కి బ్రేక్‌. మ‌ళ్లీ 20 రోజుల త‌ర‌వాత‌.. షూటింగ్ ప్రారంభిస్తారు. విరూపాక్ష‌ని 2021లో తీసుకొచ్చే ఉద్దేశాలు లేవ‌ట‌. ఈ సినిమాని 2022 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌న్న‌ది ద‌ర్శ‌క నిర్మాత‌ల ప్లాన్‌.

క్రిష్ ప‌నితీరు విభిన్నంగా ఉంటుంది. ఆయ‌న ప‌నిలో వేగం ఉంటుంది. `గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి` లాంటి సినిమానే 80 రోజుల్లో పూర్తి చేశారు. కాక‌పోతే.. `విరూపాక్ష‌`ని టైమ్ తీసుకోవాల‌ని భావిస్తున్నాడు క్రిష్‌. ఈ సినిమా విష‌యంలో ఎలాంటి హ‌డావుడీ ఉండ‌కూడ‌ద‌న్న‌ది ఆయ‌న ఉద్దేశ్యం. పైగా ఈసినిమాకి వీఎఫ్ఎక్స్ ప‌నులు చాలా కీల‌కం. అవి స‌రిగా లేక‌పోతే.. సీన్ల‌న్నీ తేలిపోతాయి. అందుకే… వీఎఫ్ఎక్స్‌కి ఎక్కువ స‌మ‌యం కేటాయించాల‌నుకుంటున్నాడు. సంక్రాంతికి ప‌వ‌న్ సినిమా వ‌స్తే.. అభిమానుల‌కు పెద్ద పండ‌గే. పైగా.. భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టుకునే అవ‌కాశం ఉంటుంది. `విరూపాక్ష‌` అనేది క్రిష్ కెరీర్‌లోనే అతి పెద్ద సినిమా. భారీ బ‌డ్జెట్ సినిమా. అందుకే… సంక్రాంతినే ఈ సినిమాకి స‌రైన స‌మ‌యం అని క్రిష్ భావిస్తున్నాడు. ఈ యేడాది ఎలాగూ వైష్ణ‌వ్ తేజ్ సినిమా విడుద‌ల ఉంటుంది. కాబ‌ట్టి క్రిష్ నుంచి సినిమా రాలేద‌న్న లోటూ ఉండ‌దు. కాబ‌ట్టే.. క్రిష్ ఇలా ప్లాన్ చేశాడ‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close