ఆ రెండే ప్రమాదమన్న మోదీ

ప్రధానమంత్రి మోదీ దృష్టిలో ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నవి రెండేనట. అందుకే ఆ రెండు సవాళ్లను ఎదుర్కోగలిగితే ప్రపంచ మానవాళి సుఖంగా ఉంటుందని ఆయన పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఇంతకీ ఆ రెండు ఏమిటంటే..
మనం హాయిగా ఉండాలంటే మనకు ప్రమాదం కలిగించే వాటికి దూరంగానైనా ఉండాలి లేదా అవి లేకుండానైనా చేసుకోవాలి.
మోదీ చెప్పిన రెండు సవాళ్లలో మొదటిది – ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఉగ్రవాదం. రెండవది – వాతావరణలో పెనుమార్పులు. ప్రధానమంత్రి తుర్కెమెనిస్థాన్ రాజధానిలో మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కుంటున్న పెద్ద సవాళ్లు టెర్రరిజం, వాతావరణలో వస్తున్న పెనుమార్పులేనని చెప్పారు. శాంతి స్థాపన ద్వారా ఉగ్రవాదమన్నది లేకుండా చేయవచ్చనీ, అలాగే పర్యావరణాన్ని కాపాడుతుంటే, వాతావరణంలో పెనుమార్పులు లేకుండా చూసుకోవచ్చని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన జాతిపిత గాంధీని స్మరించుకున్నారు. గాంధీ మార్గంలో సాగితే ఈ రెండు సవాళ్ల నుంచీ మనం బయటపడవచ్చని చెప్పారు. యోగా ద్వారా మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చనీ, అప్పుడే చెడు ఆలోచనల నుంచి దూరంగా ఉండేందుకు వీలు చిక్కుతుందని మోదీ అక్కడివారికి హితవు పలికారు.

ప్రపంచ యోగా గురువు మోదీ !

యోగాతో నూతన ప్రపంచ ఆవిష్కరణ జరుగుతుందని మోదీ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఏ దేశమేగినా ఎందుకాలిడినా యోగా ఉపన్యాసాలే దంచికొడుతున్నారు. ప్రపంచ సవాళ్లకు విరుగుడు గాంధీ సిద్ధాంతాల్లోనూ, యోగాలోనూ ఉన్నదని ఆయన నొక్కి వక్కాణిస్తున్నారు. అప్పుడెప్పుడో స్వామీ వివేకానందులవారు, మహాత్మా గాంధీ వంటి వారు విదేశాల్లో మన సంస్కృతిలోని పరమోన్నత శక్తిని విశదపరిస్తే, మళ్ళీ ఇన్నాళ్లకు మోదీ ఆ పని చేయడం నిజంగా సంతోషించదగినదే. రాజకీయాలు, వ్యూహాలు వంటి వాటిని పక్కనబెడితే, మోదీ ఆలోచనలు ప్రపంచ దేశాలన్నీ ఆచరింపదగినవేనని శాంతి కాముకులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యోగాను పరిచయం చేయడంలో ఆయన తొలి విజయం సాధించారు. ఆత్మశక్తికి మించిందిలేదనీ, మహాత్మా గాంధీ అనుసరించిన మార్గం అత్యుత్తమమైనదని మోదీ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇలా, ఇలా సాగుతూ ఆయన ప్రపంచ యోగ గురువుగా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
                                                                                                                                                           – కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో వ్యాక్సిన్…ఇండియాలో వెస్ట్ నైల్ ఫీవర్ టెన్షన్..

కరోనా పీడ విరగడ అయిందని జనం రిలాక్స్ అవుతుండగా మరో కొత్త జ్వరం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కేరళలో వెలుగుచూసిన ఈ కొత్తరకం జ్వరం అక్కడి ప్రజలను వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్...

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం, మే 5 తారీఖునాడు ఫ్రాంక్ఫుర్ట్ నగరంలో ప్రవాసాంధ్రులు ర్యాలీ...

సుకుమార్‌ని మోసం చేసిన దిల్ రాజు

సుకుమార్ సినిమా అంటే లాజిక్కుతో పాటు, ఐటెమ్ పాట‌లు గుర్తొస్తాయి. 'అ అంటే అమ‌లాపురం' ద‌గ్గ‌ర్నుంచి ఆయ‌న ప్ర‌భంజ‌నం మొద‌లైంది. 'ఊ అంటావా..' వ‌ర‌కూ అది కొన‌సాగుతూనే ఉంది. నిజానికి సుకుమార్‌కు ఐటెమ్...

కిసాన్ సమ్మాన్ కు కొర్రీలు..10 లక్షల మందికి సాయం బంద్..!?

రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తూనే అందుకు విరుద్దంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కిసాన్ సమ్మాన్ కోతలకు గురి అవుతోంది. ఈ పథకానికి అనేక కొర్రీలు పెడుతూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close