హరీష్‌లో కొట్టొచ్చినట్లుగా అసహనం!

తెరాసలో అంతర్గతంగా లుకలుకలు పొడసూపుతున్నాయా? పార్టీలో ఆధిపత్యపోరాటం నెమ్మదిగా రాజుకుంటూ ఉన్నదా? ఇది కొత్త చర్చ కాకపోయినప్పటికీ.. ఇప్పుడు పాకాన పడుతున్నదా? అంటే అవుననే అనిపిస్తోంది. సాధారణంగా ఎప్పుడు కేబినెట్‌ సమావేశాలు జరిగినా.. ఆ పిమ్మట మీడియాతో మాట్లాడడానికి ఉత్సాహంగానే స్పందిస్తూ ఉండే మంత్రి హరీష్‌రావు.. ఈ దఫా రెండు రోజుల కిందట జరిగిన కేబినెట్‌ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడకుండా మొహం చిరచిర లాడించుకుంటూ వెళ్లిపోవడం, ఆయనతో సన్నిహితులతో చేసినట్లుగా ప్రచారంలోకి వస్తున్న వ్యాఖ్యలు ఇవన్నీ ఇలాంటి అనుమానాలు కలిగిస్తున్నాయి. మొన్నటికి మొన్న కేసీఆర్‌ కేబినెట్‌ సమావేశం నిర్వహించారు. ఆ కేబినెట్‌ భేటీలోనే తనయుడు కేటీఆర్‌కు పురపాలక శాఖ మంత్రిగా పట్టం కట్టడం కూడా జరిగింది. పురపాలక శాఖ చాలా కీలకమైనది గనుక.. తన వద్దనే ఉంచుకుని, స్వయంగా తానే పర్యవేక్షిస్తానంటూ గతంలోనే ప్రకటనలు చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు దానిని కేటీఆర్‌ చేతిలో పెట్టారు. చిన్న హైడ్రామా తర్వాత పట్టాభిషేకం! పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్‌కు పట్టాభిషేకం కార్యక్రమం ముందు వెనుక చిన్న హైడ్రామా చోటు చేసుకున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తున్నది. గ్రేటర్‌లో గెలిస్తే.. ఆయనకు ఆ శాఖ ఇస్తానని బహిరంగ సభ వేదికపైనే కేసీఆర్‌ ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన జీవో మధ్యాహ్నానికి ముందే సిద్ధమైపోయింది. విడుదల చేయకుండా ఆపారు. దానికి తోడు ఆ ముందురోజే తండ్రి వారసత్వం అన్నయ్య కేటీఆర్‌కే దక్కుతుందని ఎంపీ కవిత మరోసారి వివాదాన్ని రాజకీయ వర్గాల్లో చర్చకు పెట్టారు. సాయంత్రం మంత్రి వర్గ సమావేశం జరిగింది. కేబినెట్‌ భేటీలో ఈ అంశం చర్చకు రావడం, ఎవరైనా అసహనం వ్యక్తం చేయడం లాంటివి జరగకుండా ఈ జాగ్రత్త తీసుకున్నారు. కేబినెట్‌ భేటీ ముగిసిపోయాక జీవో విడుదల చేశారు. హరీష్‌లో అసహనం అయినా ఒక నిర్ణయం మీద నేతల అసహనం కలిగే పరిస్థితి వస్తే.. ఇలాంటి చర్యల వల్ల అది ఆగదు. అదికాస్తా హరీష్‌రావు మొహంలో స్పష్టంగానే కనిపించిందని.. మీడియా పాయింట్‌ వద్ద వేచి ఉన్న వారంతా వ్యాఖ్యానించుకోవడం విశేషం. కేబినెట్‌ భేటీ అయ్యాక.. హరీష్‌రావును కామెంట్స్‌ అడిగినప్పుడు.. ఆయన పట్టించుకోకుండా.. అయిష్టంగా, వెళ్లిపోయారని తెలుస్తున్నది. నారాయణఖేడ్‌ ఉప ఎన్నిక బాద్యతల ఒత్తిడిలో ఉన్నారని ఒక స్థాయి వరకు సరిపెట్టుకోవచ్చు గానీ.. నిజానికి హరీష్‌లో అసహనానికి కారణం ఏమిటో ఎవ్వరూ ఊహించలేనిది కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close