ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ విచారణ..!?

నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అక్రమాలపై సీబీఐ విచారణకు హైకోర్టు ఉత్తర్వులు ఎలాంటి ఆటంకం కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆయన తన భార్య, కుమార్తె పేరుతో కంపెనీలు పెట్టి.. బ్యాంకుల రుణాలు తీసుకుని ఎగ్గొట్టారని కేసులు నమోదయ్యాయి. బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. రుణాలు చెల్లించని కంపెనీల ఖాతాలను మోసపూరితంగా ప్రకటించాలని ఆర్బీఐ గతంలో సర్క్యూలర్ జారీ చేసింది. ఆ మేరకు… రఘురామకృష్ణరాజు కంపెనీల ఖాతాలను కూడా ఆయా బ్యాంకులు మోసపూరిత ఖాతాలుగా ప్రకటించాయి. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. కనీసం వివరణ కూడా తీసుకోకుండా బ్యాంకులు ఆ విధంగా చేశాయని… నిలుపుదల చేయాలని కోరారు.

అప్పుడు ఆయనకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. అయితే.. ఆ తీర్పు తదుపరి చర్యలు తీసుకోవడానికి అడ్డం కాదని తాజాగా హైకోర్టు సీబీఐ విచారణ చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేవని తాజాగా స్పష్టత ఇచ్చింది. బ్యాంకులకు రఘురామకృష్ణరాజు కొన్ని వేల కోట్ల బాకీ ఉన్నారు. ఆయనపై సీబీఐ కేసులు కూడా ఉన్నాయి. కారణం ఏమిటో కానీ ఎంపీగా ఎన్నిక కాక ముందు ఆయన ఇళ్లల్లో సోదాలు చేశారు కానీ.. తర్వాత పట్టించుకోవడం మానేశారు. హైకోర్టు ఉత్తర్వుల కారణంగానే సీబీఐ ఆగిపోయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు… హైకోర్టు సీబీఐ విచారణకు .. తన ఉత్తర్వులు అడ్డంకి కాదని స్పష్టం చేసింది.

ఇటీవల సుజనా చౌదరికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా… ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. అయితే ఆయన బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. హైకోర్టు నుంచి ఇలాంటి రూలింగ్ వచ్చిన రోజునే ఆయన ప్రధానితో భేటీ అయ్యారు. ఈ కారణంగా ఆయన మరీ టెన్షన్ పడటం లేదంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close