ఇళ‌య‌రాజాకు ఛాలెంజ్ విసిరిన మోహ‌న్ బాబు

మోహ‌న్ బాబు సూప‌ర్ హిట్ల‌లో.. ఇళ‌య‌రాజా పాత్ర కూడా ఉంది. ఓ ద‌శ‌లో.. మోహ‌న్ బాబుతో వ‌రుస సినిమాల‌కు ప‌ని చేశారు ఇళ‌య‌రాజా. ఇప్పుడు సుదీర్ఘ విరామం త‌ర‌వాత ‘స‌న్నాఫ్ ఇండియా’ చిత్రానికి ఆయ‌న స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. ఎలాంటి సంద‌ర్భానికైనా, ఎలాంటి ప‌దాల‌కైనా బాణీ క‌ట్ట‌డం ఇళ‌య‌రాజా ప్ర‌త్యేక‌త‌. అలాంటి ఇళ‌య‌రాజాకే ఓ స‌వాల్ విసిరారు మోహ‌న్ బాబు.

11వ శ‌తాబ్దానికి చెందిన క‌వి వేదాంత దేశిక ‘ర‌ఘువీర’ అనే గద్యం ర‌చించారు. సంస్కృత స‌మాసాల‌తో చాలా క్లిష్టంగా సాగుతుంది. రాముడి గొప్ప‌త‌నాన్ని కీర్తిస్తూ సాగే గ‌ద్యం ఇది. దీన్ని పాట చేయాలంటూ ఇళ‌య‌రాజా ద‌గ్గ‌ర‌కు వెళ్లారు మోహ‌న్ బాబు. ఆ గ‌ద్యం మోహ‌న్ బాబు నోటి నుంచి విన్న ఇళ‌య‌రాజా.. `ఇది చాలా క్లిష్టంగా ఉంది.. మీరు పాడ‌తారా` అని అడ‌గ‌డం దానికి మోహ‌న్ బాబు `నేను డైలాగులు మాత్ర‌మే చెబుతా.. పాట‌లు పాడ‌లేను` అని చెప్ప‌డం… ఈ గ‌ద్యానికి ట్యూన్ చేయ‌డాన్ని ఇళ‌య‌రాజా ఓ స‌వాల్ గా తీసుకోవ‌డం జ‌రిగిపోయాయి. ఈ పాట రికార్డింగ్ కూడా పూర్త‌య్యింది. మ‌రి ఆ పాట ఎలా పాడారో? 11వ శ‌తాబ్దానికి చెందిన గ‌ద్యానికీ… ఈ సినిమాకీ సంబంధం ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. డైమండ్ ర‌త్న‌బాబు ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌యింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు....

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...
video

టీజర్ రివ్యూ : ఇస్మార్ట్ డబుల్ మాస్

https://youtu.be/tq2HmozH_5Y?si=7YJ-IcGKWvYsaRDj రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'తో అలరించబోతున్నారు. రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు. ల్యాబ్‌లో ఉన్న...

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close