ఎన్నికలు పెట్టను..తేల్చేసిన నిమ్మగడ్డ..!

పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ..  మార్చి 31వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని అందుకే తాను నోటిఫికేషన్ ఇవ్వలదల్చుకోలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తేల్చి చెప్పేశారు. ఆయన హయాంలోనే ఎన్నికలు నిర్వహించాలని వారం రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేయవచ్చని ముఖ్యమంత్రి సహా పలువురు ప్రభుత్వంలోని పెద్దలు చెబుతున్న సమయంలో.. నిమ్మగడ్డ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. పరిషత్ ఎన్నికలు రాష్ట్రం మొత్తం ఒకే సారి నిర్వహించడం సాధ్యం కాదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్లుగానే నాలుగు విడతలుగా నిర్వహించాలి. ఆలా చేయడానికి కనీసం ఒక్కో విడతకు ఐదుల గ్యాప్ ఇచ్చినప్పటికీ.. ఇరవై రోజుల సమయం పడుతుంది. అందుకే నిమ్మగడ్డ తన హయాంలో నిర్వహించడానికి సిద్ధంగా లేరు.

నిజానికి గతంలోనే ఆయన ఎన్నికలు నిర్వహించాలనుకున్నారు. కానీ… ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. ఏకగ్రీవాల విషయంలో… విచారణ నిర్వహించాలని నిమ్మగడ్డ ఆదేశించడం ప్రభుత్వానికి నచ్చలేదు. దాంతో కోర్టుకు వెళ్లి అనుకూల నిర్ణయం తె‌చ్చుకున్నారు. దాంతో సమయం గడిచిపోయింది. ఒక వేళ ప్రభుత్వం నిమ్మగడ్డ నిర్ణయంపై కోర్టుకు వెళ్లకపోతే.. ఈ పాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయి ఉండేదే. అయిేత ఇప్పటికీ.. దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాల కారణంగా నామినేషన్లు వేయలేకపోయినవారు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని.. నిమ్మగడ్డ స్పష్టం చేశారు.

ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం నిమ్మగడ్డను ఓ రకంగా బెదిరింపులకు గురి చేసింది. ఆయన సెలవు పెట్టబోతున్నారని తెలుసుకుని ప్రివిలేజ్ నోటీసు జారీ చేయించింది. అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. అయితే నిమ్మగడ్డ మాత్రం.. రివర్స్‌లో తన లేఖల లీకేజీ అంశంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. చివరికి ఆయన పదవి కాలం ముగిసిపోతోంది. ప్రభుత్వం కూడా ఇప్పుడు రియలైజ్ అవుతున్నట్లుగా ఉంది. కొత్త ఎస్‌ఈసీతోనే ఎన్నికలు నిర్వహించుకోవాలన్న ఆలోచనలో పడింది. క్షణం ఆలస్యం కాకుండా ఎస్‌ఈసీ నియామకానికి ఏర్పాట్లు చేసుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close