షర్మిలను పట్టించుకోని పార్టీలు..!

తెలంగాణలో రాజకీయపార్టీలు వైఎస్ షర్మిలను పట్టించుకోవడం లేదు. తాను పార్టీ పెట్టబోతున్నానని ఖమ్మం గడ్డ మీద ఆమె ప్రకటించారు. అంతే కాదు.. తన బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఆమె సభపై రాజకీయవర్గాలు ఓ కన్నేశాయి. ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందోనని పరిశీలించాయి. చివరికి…స్పందించేంత పెద్ద పార్టీ కాదనే అభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది.అందుకే.. షర్మిల సభపై కొంత మంది రాజకీయ నేతలు వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేశారు కానీ.. పార్టీల పరంగా అయితే… నో కామెంట్ విధానాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాయి.

షర్మిల ఖమ్మం సభలో ఎక్కువగా కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. హామీలు అమలు చేయడం లేదని విరుచుకుపడ్డారు. మామూలగా ఆమె చేసిన విమర్శలకు… టీఆర్ఎస్ వైపు నుంచి దూకుడైన రిప్లయ్ రావాలి. అవసరంగా స్పందించి హైప్ ఇవ్వడం ఎందుకని టీఆర్ఎస్‌లో నిర్ణయం జరిగింది. అందరికీ అదే సమాచారం పంపారు. షర్మిల పార్టీ విషయంలో.. అనవసరంగా ఆవేశపడాల్సిన అవసరం లేదని తేల్చేశారు. దీంతో టీఆర్ఎస్ నేతలెవరూ నోరు మెదపలేదు. కాంగ్రెస్ కూడా అంతే..  బీజేపీ కూడా అంతే . అధికారికంగా స్పందించకూడదని నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్‌లో వీహెచ్… బీజేపీలో ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ మాత్రం స్పందించారు. కానీ వాటిని పార్టీ అభిప్రాయాలుగా పరిగణనలోకి తీసుకోవడం లేదు.

షర్మిల రాజకీయ పార్టీ ఆరంగేట్రం మొత్తం ఓ ఈవెంట్‌లాగా… జరుగుతోందన్న అభిప్రాయం  రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది. కృత్రిమంగా హైప్ క్రియేట్ చేసుకునేందుకు హంగామా చేస్తున్నారు కానీ…  ప్రజల్లో స్పందన లేదని… పార్టీలు నమ్ముతున్నాయి. ఖమ్మంలో ఏర్పాటు చేసిన సభకు పట్టుమని ఐదు వేల మంది కూడా రాలేదని… అంచనా వేశారు. వచ్చిన జనం కన్నా.. వాహనాలే ఎక్కువున్నాయన్న అభిప్రాయం కూడా వినిపించింది. జనసమీకరణ చేసే పార్టీ నిర్మాణం కూడా లేదని… ఆమె పార్టీ మొదట్లోనే తేలిపోయిందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అందుకే స్పందించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close