ఆంధ్రజ్యోతి ఆర్కేను పరామర్శించిన జగన్, విజయసాయి..!

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ అంటే పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే వారిలో వైసీపీ అధినేతలు ముందు ఉంటారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి … వేమూరి రాధాకృష్ణను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులపై దాడులు కూడా చేశారు. పత్రికకు.. చానల్‌కు ప్రకటనలు ఇవ్వడంలేదు. ఇక విజయసాయిరెడ్డి అయితే ట్వీట్లలో ఆయన సంస్కారం మరచి విమర్శలు చేస్తూంటారు. అయితే.. ఇప్పుడు ఇద్దరూ… ఓ విషయంలో వేమూరి రాధాకృష్ణకు మద్దతుగా నిలిచారు. కష్టకాలంలో దైర్యంగా ఉండాలని మంచి మాటలు చెప్పారు. వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం అయిన విషయం తెలిసిన ముఖ్యమంత్రి జగనమోహన్ రెడ్డి… మధ్యాహ్నం ఆయనకు ఫోన్ చేశారు.

తీరని నష్టమే జరిగినా… తగినంత ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడ్ని కోరుకున్నట్లుగా చెప్పారు. మామూలుగా అయితే జగన్ .. వేమూరి రాధాకృష్ణపై చూపే వ్యక్తిగత ద్వేష స్థాయిని పరిశీలిస్తే..నేరుగా ఫోన్ చేయరు. మీడియా అధిపతి కాబట్టి.. ఓ ట్వీట్ పెట్టేవారేమో. కానీ అనూహ్యంగా ఫోన్ చేసి.. తన సంతాపాన్ని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మ్యానర్స్ లేకుండా ట్వీట్లు చేసే విజయసాయిరెడ్డి అనూహ్యంగా స్పందించారు. ఆయన కూడా.. వేమూరి రాధాకృష్ణ కోసం దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లుగా చెప్పారు.

మంచి మాటలు తన ట్వీట్లలో కనిపించే ప్రయత్నమే చేయరు విజయసాయిరెడ్డి. ముఖ్యంగా ఇతర పార్టీల నేతలు… రాజకీయంగా ప్రత్యర్థులు అనుకునేవారిని వదిలి పెట్టారు. కానీ ఎంతో తీవ్రంగా ద్వేషించే వేమూరి రాధాకృష్ణకు సానుభూతిగా ఆయన ట్వీట్ పెట్టారు. ఈ ఇద్దరి స్పందనలు… నేటి హైలెట్‌గా నిలిచాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close