ఒక్క సమీక్షతో వైద్యారోగ్యశాఖపై కేసీఆర్ ముద్ర..!

ఈటల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్యశాఖను తీసేసుకున్న తర్వాత ఆ శాఖను పట్టించుకునేవారు లేకుండా పోయారని.. కరోనా కాలంలో ప్రజల్ని గాలికి వదిలేశారని విపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు… సీఎం కేసీఆర్ ఒకే ఒక్క సమీక్షతో ధనాధన్ సమాధానం చెప్పారు. ఆదివారం సుదీర్ఘంగా.., రాత్రి పొద్దు పోయే వరకూ సమీక్షలు జరిపి.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు, మూడు నెలల కాలానికి యాభై వేల మంది వైద్యులను నియమించాలని.. డిసైడయ్యారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారందరూ.. దరఖాస్తు చేసుకోవాలని.. కరోనా విజృంభణను అడ్డుకోవడానికి వైద్య పరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే తీసుకునేవారు రెండు, మూడు నెలల కాలానికే పనిచేయాల్సి ఉంటుంది.

ఎంత కాలం అన్న సంగతి తర్వాత ముందుగా.. అసలు యాభై వేల మంది డాక్టర్లు దొరుకుతారా… అన్నది పెద్ద సందేహం. యాభై వేల మంది కాదు.. కనీసం రెండు వేల మంది డాక్టర్లు కూడా.. పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నా… రాని పరిస్థితి ఉంది. అలాంటిది కేసీఆర్ ఎలా అంచనా వేశారో కానీ.. ఏకంగా యాభై వేల మంది వైద్యులనేశారు. బహుశా వైద్యల కేటగిరిలోనే ఇతర వైద్యసిబ్బందిని చేర్చి ఉంటారు. అయితే మిగిలిన మెడికల్ స్టాఫ్ కూడా.. ఇప్పుడెవరూ ఖాళీగా లేరు. ఫుల్ డిమాండ్ మీద రాత్రింబవళ్లు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సర్కార్ రెండు నెలల కాలానికి ఉద్యోగమిస్తామని చెబితే.. ఉన్న ఉద్యోగం వదిలేసి వచ్చే పరిస్థితి లేదు. అదే సమయంలో కేసీఆర్ వైద్యా ఆరోగ్య శాఖను చూస్తున్న సందర్భంగా వరంగల్ , ఆదిలాబాద్‌లలో రెండు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఆయా ఆస్పత్రులకు.., ప్రభుత్వ వాటా కింద చెల్లించాల్సిందిన రూ. ఇరవై ఎనిమిదికోట్లను వెంటనే చెల్లించాలని అక్కడికక్కడ ఆర్థిక శాఖనూ ఆదేశించారు. కేసీఆర్ ఎప్పుడు కీలకమైన సమీక్ష చేసినా ఇలాంటి ఆదేశాలే వెల్లువెత్తుతాయి.

కానీ.. అమలు ఎంత వరకూ అనేది మాత్రం… తర్వాత తరవాత తేలుతుంది. కానీ అప్పటికి జనం మర్చిపోతారు. మరో విశేషం ఏమిటంటే.. కేసీఆర్ ఇలా వైద్య ఆరోగ్యశాఖ తీసుకుని కేంద్రంతో రాష్ట్ర అవసరాలు చెప్పి.. కరోనా నియంత్రణకు కొన్ని సూచనలు చేయగానే.. ప్రధానమంత్రి మోడీ స్పందించారు. కేసీఆర్ అద్భుతమైన సలహాలు ఇచ్చారని.. వాటిని అమలు చేస్తామని చెప్పారని సీఎంవోనే ప్రకటనలో తెలిపింది. మొత్తానికి ఈటల రాజేందర్ నుంచి వైద్యారోగ్యశాఖ తీసుకున్న తర్వాత కేసీఆర్.. ఫస్ట్ బాల్ సిక్సర్ కొట్టేసి… దూసుకెళ్తున్నారని టీఆర్ఎస్ నేతలు… సంతోషం ఫీలవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close