హైకోర్టులో రఘురామరాజుకు షాక్..!

హైకోర్టులో రఘురామకృష్ణరాజుకు షాక్ తగిలిగింది. తన అరెస్ట్ అక్రమం అంటూ ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బెయిల్ కోసం.. సీఐడీ కోర్టుకే వెళ్లాలని సూచించింది. రఘురామకృష్ణరాజు దాఖలు చేసుకునే బెయిల్ పిటిషన్‌పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని.. కింది కోర్టుకు హైకోర్టు సూచించింది. అదే సమయంలో.. రఘురామకృష్ణరాజుకు మూడు నెలల కిందటే బైపాస్ సర్జరీ జరిగిందని.. పిటిషనర్ తరపు న్యాయవాదులు విన్నవించడంతో.. ఆయన ఆరోగ్యానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి సూచించారు. దీంతో రఘురామకృష్ణరాజు.. కొన్ని రోజుల పాటు జైల్లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

అంతకు ముందు రఘురామకృష్ణరాజుపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో రఘురామకృష్ణరాజు ప్రతీ రోజూ మీడియాతో మాట్లాడటాన్ని ప్రసారం చేసిన ఏబీఎన్, టీవీ 5 చానళ్లను కూడా కుట్రదారులుగా సీఐడీ అధికారులు పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా ప్రభుత్వంపై అసంతృప్తి పెంచేలా.. రఘురామకృష్ణరాజు మాట్లాడుతూంటే… ఈ రెండు చానళ్లు ప్రసారం చేస్తున్నాయని అది కుట్ర అని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఆ చానళ్లు స్లాట్స్ కేటాయించారని … కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారని వారు కుట్రలో భాగస్వాములని సీఐడీ చెబుతోంది. కులం, మతం ప్రాతిపదికన విభజన తెచ్చేందుకు ప్రయత్నించారని సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

సీఐడీ ఎఫ్ఐఆర్ మొత్తం చూస్తే.. రఘురామకృష్ణరాజు ప్రతీ రోజూ రచ్చ బండ పేరుతో మాట్లాడేవాటిని ప్రసారం చేయడమే అసలు కేసుకు మూలం అన్నట్లుగా ఉంది. ప్రతీ రోజూ ఆయన ప్రభుత్వాన్ని అనేక అంశాలపై విమర్శిస్తూ ఉంటారు. అయితే… సీఐడీ…ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి ఎవరూ ఫిర్యాదులు చేయలేదు. సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేసి.. ప్రాథమిక ఆధారాలుఉన్నాయని నిర్ధారించుకుని కేసు పెట్టేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close