క‌ర్నూలులోనూ సోనూసూద్ ఆక్సిజ‌న్ ఫ్లాంట్

రోజు రోజుకీ… ధాతృత్వంలో కొత్త మెట్లు ఎక్కుతున్నాడు సోనూసూద్‌. అడిగిన‌వాళ్ల‌కూ, అడ‌గ‌నివాళ్ల‌కు సైతం వ‌రాలు కురిపిస్తున్నాడు. తాజాగా క‌ర్నూలు కేంద్రంగా ఓ ఆక్సిజ‌న్ ఫ్లాంట్ ని నిర్మించ‌డానికి రెడీ అయ్యాడు. క‌ర్నూలు జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రికి అనుసంధానంగా ఓ ఆక్సిజ‌న్ ప్లాంట్ నెల‌కొల్ప‌డానికి సోనూసూద్ ముందుకొచ్చాడు. దీని విలువ దాదాపు 3 కోట్ల‌రూపాయ‌లు ఉంటుంద‌ని స‌మాచారం. దాదాపు 200 ప‌డ‌క‌ల‌కు ఈ ప్లాంట్ ద్వారా ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ సోకి, ఆక్సిజ‌న్ అంద‌క చాలామంది రోగులు త‌మ ప్రాణాల్ని కోల్పోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విప‌త్తుని గ్ర‌హించిన సోసూసూద్‌.. ఆక్సిజ‌న్ సిలెండ‌ర్ల ఏర్పాటుకు కంక‌ణం క‌ట్టుకున్నాడు. `నాకో మిస్డ్ కాల్ ఇవ్వండి. మీ ఇంటికే ఆక్సిజ‌న్ సిలెండ‌ర్ పంపిస్తా` అంటూ తన సేవా దృక్ప‌థాన్ని చాటుకుంటున్నాడు. మాకో ఆక్సిజ‌న్ ఫ్లాంట్ కావాలంటూ జిల్లాల‌వారిగా సోనూసూద్‌కి విన్న‌పాలు అందుతున్నాయి. అందులో భాగంగా క‌ర్నూలులో ఆక్సిజ‌న్ ఫ్లాంట్ ఏర్పాటు చేయ‌డానికి సోనూ ముందుకొచ్చాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close