కృష్ణపట్నం కరోనా మందు చుట్టూ రాజకీయం..!

నెల్లూరు జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు బొనిగే ఆనందయ్య వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. రాజకీయ పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అవడం.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూడంటంతో.. మొత్తం రాజకీయం అయిపోయింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి చెందిన బొనిగె ఆనందయ్య ఆయుర్వేద వైద్యం చేస్తూంటారు. నిన్నామొన్నటిదాకా ఆయనకు పెద్దగా ప్రాచుర్యం లభించలేదు. కానీ కరోనాకు చికిత్స చేయడం ప్రారంభించిన తర్వాత ఆయన పేరు మార్మోగిపోయింది. కృష్ణపట్నంలో ఎవరికీ కరోనా సోకలేదు. ఆయన మందు తీసుకున్న ఎవరికీ కరోనా రాలేదు. దాంతో ఆయనకి నమ్మకం కుదిరి చుట్టుపక్కల గ్రామాల వారికి ఇచ్చారు. అందరూ బాగుందని, బాగా పనిచేస్తుందని చెప్పడంతో ఉచితంగా పంపిణీకి శ్రీకారం చుట్టారు..

ఆనంద్ కుమారులు ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. వారి నుంచి లక్ష రూపాయలు తీసుకుని మందు తయారు చేసి పంపిణీ చేయడం ఆరంభించారు. ఆ తరువాత మందు వాడి కరోనా తగ్గిన వారే….మందు తయారీకి సామగ్రి సమకూరుస్తున్నారు. గ్రామంలో యువకులు పలువురు వాలంటీర్లుగా పనిచేస్తూ సేవ చేస్తున్నారు. కరోనా సోకకుండా ముందు జాగ్రత్తగా ఒక మందు… వచ్చిన వారికి తగ్గేందుకు మరో మందు… పరిస్థితి విషమంగా ఉన్నవారికి ఇంకో మందు తయారు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాతో పాటు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనం బారులు తీరుతున్నారు.

ఈ మందు గురించి సామాజిక మాధ్యమాల్లో చూసిన తమిళనాడు, కేరళ ప్రాంతాలకి చెందిన పలువురు ఆయుర్వేద వైద్యులు సైతం…తయారీ విధానం తెలుసుకునేందుకు నెల్లూరు చేరుకున్నారు. పబ్లిసిటీ పెరగడంతో ఇతర రాష్ట్రాల వారూ వస్తున్నారు. దీంతో రాజకీయ కన్ను పడింది. ఇదేదో తేడాగా ఉందని లోకాయుక్త లక్ష్మణరెడ్డి విచారణకు ఆదేశించారు. పంపిణీని నిలిపివేయించారు. దీంతో అది రాజకీయ అంశం అయిపోయింది. ఆనందయ్యకు మద్దతుగా కొంత మంది .. వ్యతిరేకంగా కొంత మంది బయలుదేరారు. ప్రభుత్వ విచారణ కమిటీలు నియమించింది. సోషల్ మీడియాలో ఇదొక ట్రెండింగ్ టాపిక్ అయింది. అనేక పరిశోధనలు చేశారు. అయితే ఆ మందు వల్ల… సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవని చెబుతున్నారు.

నిజానికి ఇలాంటి వైద్యాన్ని పక్ష వాదం దగ్గర్నుంచి అనేక రకాల వ్యాధులకు అందించే వారు చాలా మంది ఉన్నారు. నమ్మకంతో వెళ్తూ ఉంటారు. వైద్యానికి నమ్మకమే మొదటి పునాది. మరి ఈ ఆనందయ్య కరోనా వైద్యాన్ని నమ్ముతున్న వారిని ప్రభుత్వం.. ఏం చేస్తుందో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close