ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ మొదటి వీసీగా కరణం మల్లీశ్వరి ని నియమించిన ఆప్

ఒలింపిక్ మోడల్ గ్రహీత అయిన కరణం మల్లేశ్వరి ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కి మొదటి వైస్ ఛాన్సలర్ గా నియమించింది. వివరాల్లోకి వెళితే..

ఆముదాలవలస లో పుట్టిన కరణం మల్లేశ్వరి భారతదేశానికి ఒలంపిక్స్ లో మెడల్ సాధించిన మొదటి మహిళ. 2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో కంచు పతకం సాధించడం ద్వారా ఒలంపిక్ లో మెడల్ సాధించిన మొదటి భారత మహిళ గా చరిత్ర సృష్టించింది మల్లీశ్వరి. ఒలంపిక్స్ పతకం సాధించడానికి ముందే ఆసియా వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లో, ప్రపంచ ఛాంపియన్షిప్ లోను పలుమార్లు గెలిచిన కరణం మల్లేశ్వరి పద్మశ్రీ, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న వంటి అవార్డులు కూడా పొందింది.

తాజాగా ఢిల్లీలో ఏర్పాటైన స్పోర్ట్స్ యూనివర్సిటీ కి మొదటి వైస్ ఛాన్సలర్ గా నియమించబడింది కరణం మల్లేశ్వరి. ఇతర అకడమిక్ డిగ్రీ ల తో సంబంధం లేకుండా కేవలం స్పోర్ట్స్ లోనే డిగ్రీలు చేయగలిగే వినూత్న విధానంలో ఏర్పాటు చేయబడ్డ ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ, భవిష్యత్తులో భారీగా భారతదేశానికి ఒలంపిక్స్ సాధించాలని ఆశయాన్ని కలిగి ఉంది. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కి మొదటి వైస్ ఛాన్సలర్ గా ఆమ్ ఆద్మీ పార్టీ కరణం మల్లేశ్వరి ని ఎంచుకుంది. దీని పట్ల తెలుగు క్రీడా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబుతో ఫోన్‌ మాట్లాడేందుకు జగన్ నిరాకరణ !

ప్రమాణ స్వీకారానికి రావాలని సంప్రదాయంగా ఆహ్వానించేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నించారు. కానీ జగన్మోహన్ రెడ్డి అందుబాటులోకి రాలేదు. జగన్ కు ఫోన్ లేదు. కానీ ఆయన ఆయన పీఏలు.. ఇతరులకు.. ఉంది. అందుకే...

రెడ్ బుక్ రాసుకోవాల్సింది కేటీఆర్ కాదా ?

రెడ్ బుక్ రాస్తున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించారు. ఎందుకంటే అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని.. కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలుకుతున్నారని.. బీఆర్ఎస్ నేతల్ని వేధిస్తున్నారని వారి...

పరస్పర గౌరవం కూటమి బలం !

రాజకీయాల్లో కూటముల మధ్య పొరపొచ్చాలు రావడానికి పెద్ద పెద్ద కారణాలు అక్కర్లేదు. చిన్న చిన్న సమస్యలు చాలు. రాజకీయాల్లో పండిపోయిన చంద్రబాబుకు ఇది బాగాతెలుసు. అందుకే కూటమి విషయంలో ఆయన వ్యవహారశైలి...

చంద్ర‌బాబుకూ జ‌గ‌న్‌కూ అదే తేడా!

జ‌గ‌న్ రెడ్డి ఐదేళ్ల పాల‌న‌లో చిత్ర‌సీమ‌ని అస్స‌లు ప‌ట్టించుకోలేదు. క‌నీసం గౌర‌వం కూడా ఇవ్వ‌లేదు. చిరంజీవి దండం పెట్టినా - ప్ర‌తిన‌మ‌స్కారం చేయ‌ని సంస్కార హీనుడిగా ఆయ‌న చ‌రిత్ర‌లో నిలిచిపోయాడు. ఇండ‌స్ట్రీ నుంచి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close